హైదరాబాద్ జులై 11 (ఇయ్యాల తెలంగాణ );అంగన్వాడీ కేంద్రాల్లో నర్సరీ పాఠాలు: మంత్రి సీతక్క రాష్ట్రంలోని అంగన్ వాడీ కేంద్రాల్లో నర్సరీ పాఠాలు బోధించనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. సీఎం రేవంత్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. మహిళా భద్రత, చైల్డ్ కేర్పై అధికారులతో సవిూక్షలో ఆమె మాట్లాడుతూ. దేశంలోనే తొలిసారిగా చిన్నారులకు యూనిఫాంలు అందిస్తామన్నారు. అంగన్ వాడీల్లో చిన్నారుల సంఖ్యను పెంచేందుకు ‘అమ్మ మాట`అంగన్వాడీ బాట’ పేరుతో జులై 15 నుంచి వారం రోజుల పాటు కార్యక్రమం చేపడతామన్నారు.