అక్రమ బంగారం స్వాధీనం

శంషాబాద్‌ అక్టోబర్ 19 (ఇయ్యాల తెలంగాణ ):హైదరాబాద్‌ అబుదాబి ప్రయాణికుడి నుంచి భారీగా అక్రమ బంగారం పట్టుకున్నారు. హైదరాబాద్‌` శంషాబాద్‌ నుండి అబుదాబి వెళ్లేందుకు వచ్చిన శ్రీరంగప్ప అనే ప్రయాణికుడి వద్ద కిలోన్నర అక్రమ బంగారం వున్నట్లు అధికారులు గుర్తించారు. నింధితుడి లగేజీ స్క్రీనింగ్‌ చేసిన సిఐఎస్‌ఎఫ్‌ ఆధికారులు అందులో కిలోన్నర బంగారం బిస్కెట్లు గుర్తించారు. బంగారం స్వాధీనం చేసుకున్న సిఐఎస్‌ఎఫ్‌ సెక్యూరిటీ అధికారులు నింధితుని కష్టమ్స్‌ అధికారులకు అప్పగించారు. స్వదేశం నుండి విదేశాలకు అక్రమ బంగారం తరలించి పట్టుబడడం ఎయిర్‌ పోర్ట్‌ చరిత్రలోనే ఇదే మొదటి సారి. దుబాయ్‌, షార్జా, అబుదాబి నుండి అక్రమ బంగారం పట్టుబడడం చూసిన ఆధికారులు  మొదటి సారి ఇండియా నుండి విదేశాలకు అక్రమ బంగారం తరలించేందుకు ప్రయత్నించి పట్టుబడడం మొదటి సారి కావడం విశేషం

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....