అదుపు తప్పిన కారు బీభత్సం..ఇద్దరు మృతి రంగారెడ్డి

 

అదుపుతప్పిన వేగంతో దూసుకొచ్చిన కారు మార్నింగ్‌ వాకర్స్‌ పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు తల్లీ కూతుళ్లు  అక్కడికక్కడే మృతి చెందగా… మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు మార్నింగ్‌ వాకింగ్‌ కు వచ్చిన అనురాధ (38), మమత (24) పోలీసులు గుర్తించారు. క్షతగాత్రులను హుటా హుటిన ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. మంగళవారం ఉదయం నార్సింగి పరిధిలోని సన్‌ సిటీ వద్ద జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. అదుపుతప్పిన వేగంతో మృత్యువు రూపంలో దూసుకొచ్చిన కారు మార్నింగ్‌ వాకర్స్‌ ను ఢీకొట్టి చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది. ప్రమాదం నేపథ్యంలో ఘటన స్థలం రక్త మోడిరది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....