అప్పన్న ధ్వజస్తంభంకు స్వర్ణకాంతులు 1.8 కేజీల బంగారంతో మెరుగులు

విశాఖపట్నం సెప్టెంబర్ 15 (ఇయ్యాల తెలంగాణ ):దక్షిణ భారతదేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహాలక్ష్మీనృసింహస్వామి ద్వజస్థంభం స్వర్ణకాంతులీనుతుంది. ఇప్పటి వరకు ఈ ద్వజస్థంభం ఇత్తడి తాపంతో భక్తులకు దర్శనమిచ్చేది. అయితే బంగారు తాపడం చేయించేందుకు ప్రముఖ వస్త్ర, నగల వ్యాపార సంస్థ సిఎంఆర్‌ అధినేత మావూరి వెంకటరమణ ముందుకు వచ్చారు. సుమారు 1.8 కేజీల బంగారం (1802 గ్రాములు)తో ఈ ద్వజస్థంబానికి స్వర్ణతాపడం పనులు పూర్తి చేయించారు. ఇక విూదట అప్పన్న భక్తులకు సింహాద్రినాధుడి ద్వజస్థంభం దర్శనం బంగారు కాంతులతో కానరానుంది. బుధవారం ఉదయం నుంచి తాపడం పనులు పూర్తి చేశారు. సాయంత్రం ఆలయ స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్‌ ఆధ్వర్యంలో ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, పురోహితులు కరి సీతారామాచార్యులు, ఇన్‌ చార్జ్‌ ప్రధానార్చక వెంకటరమణాచార్యులు, ఉప ప్రధానార్చకులు నరసింహం ఆచార్యులు, అర్చక పరివారం, వేద పండితులు ఆయా పూజాది కార్యక్రమాలను శాస్త్రోక్తంగా జరిపించారు. తొలుత విశ్వక్సేన, పుణ్యహవచనం, మహాసంప్రోక్షణ, షోడసోపచార పూజలు, గరుడ మూలమంత్రం, పంచసూక్తాలతో ప్రత్యేక హోమం నిర్వహించారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....