అయ్యప్ప స్వాముల Bus బోల్తా – డ్రైవర్‌ మృతి.. పలువురికి గాయాలు

హైదరాబాద్‌, జనవరి 03 (ఇయ్యాల తెలంగాణ) : హైదరాబాద్‌ పాతబస్తీ మదన్న పేట ఉప్పర్‌ గూడా కి చెందిన అయ్యప్ప స్వాముల బస్సు బోల్తా పడిరది. ఎరుమెలి నుండి పంపా నది శబరి వెళ్తున్న గురు స్వామి రాంపాల్‌ యాదవ్‌, అభి యాదవ్‌, రామ్‌ యాదవ్‌, పెద్ది యాదవ్‌ ల అద్వర్యంలో  వెళ్తున్న అయ్యప్ప స్వాములు బస్సు పంపా నది కి 15కిలోవిూటర్ల దూరం లోని ఘాట్‌ రోడ్డులో బోల్తా పడిరది.. ఘాట్‌ రోడ్డు మలుపులో అదుపు తప్పి బోల్తా పడ్డ బస్సు మూడు చెట్ల పై ఒరగడం తో  పెద్ద ప్రమాదం తప్పింది . బస్సులో ఉన్న 22 మంది అయ్యప్ప స్వాములు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను కొట్టాయం మెడికల్‌ కాలేజి ఆసుపత్రికి తరలించారు తీవ్రగాయాలు పాలైన డ్రైవర్‌ రాజు అక్కడికక్కడే మృతి చెందాడు. అయ్యప్ప స్వాములు అందరూ స్వల్పగాయలతో బయటపడ్డారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....