ఆరోగ్యశ్రీ బోర్డు భేటీ హజరయిన మంత్రి హరీష్‌ రావు

హైదరాబాద్‌, జులై 18 (ఇయ్యాల తెలంగాణ ):మంగళవారం జూబ్లీహిల్స్‌ లోని ఆరోగ్య శ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ కార్యాలయంలో ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్‌ రావు అధ్వర్యంలో బోర్డు విూటింగ్‌ నిర్వహించారు. ఈ సమావేశంలో హెల్త్‌ సెక్రెటరీ రిజ్వీ, ఆరోగ్య శ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ సిఇఒ విశాలాచ్చి, సీఎం ఓఎస్డీ గంగాధర్‌, డిఎంఇ రమేష్‌ రెడ్డి, డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ జి శ్రీనివాస్‌ రావు, టీవీవీపీ కమిషనర్‌ అజయ్‌ కుమార్‌, నిమ్స్‌ డైరెక్టర్‌ బీరప్ప, ఇతర అధికారులు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఆరోగ్యశ్రీ పరిమితి 2 నుండి 5 లక్షల కు పెంచిన దృష్ట్యా కొత్త ఆరోగ్యశ్రీ డిజిటల్‌ కార్డులను రూపొందించి, స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా జిల్లాల్లోని లబ్ధిదారులకు అందించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందుకోసం లబ్ధిదారుల ఈ కేవైసీ ప్రక్రియను త్వరగా పూర్‌ చేయాలని ఆదేశించారు. నిమ్స్‌ స్పెషలిస్ట్‌ డాక్టర్‌ ల ద్వారా ఆరోగ్యశ్రీ  కేసుల మెడికల్‌ ఆడిట్‌ నిర్వహణ చేయాలి. కోవిడ్‌ సమయంలో ఎక్కడా చేయని విధంగా రికార్డు స్థాయిలో 856 బ్లాక్‌ ఫంగస్‌ సర్జరీలు విజయవంతంగా నిర్వహించి, ప్రజల ప్రాణాలు కాపాడిన కోఠి ఈఎన్టీ ఆసుపత్రికి రూ. కోటి 30 లక్షల అదనపు ప్రోత్సాహకం ఇవ్వాలని నిర్ణయించారు. మూగ, చెవిటి పిల్లలకు చికిత్స అందించి బాగు చేసే కాక్లియర్‌ ఇంప్లాంట్‌ సర్జరీలు ప్రస్తుతం కోఠి ఈఎన్టీ ఆసుపత్రిలో ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్నది. ఈ తరహా సేవలను ఎంజీఎం  వరంగల్‌ లో కూడా అందుబాటులోకి తెచ్చేందుకు కమిటీ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.తెలంగాణ ఏర్పాటుకు ముందు రాష్ట్రంలో కేవలం 3 డయాలసిస్‌ కేంద్రాలు మాత్రమే ఉంటే, తెలంగాణ ప్రభుత్వం ఆ సంఖ్యను 103కు చేర్చించింది. వ్యవప్రయాసలకు ఓర్చి దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా నియోజకవర్గం పరిధిలోనే డయాలసిస్‌ కేంద్రాలు ఏర్పాటు చేసింది. దీంతో కిడ్నీ బాధితులకు ఇవి వరంగా మారాయి. మరింత నాణ్యంగా డయాలిసిస్‌ సేవలు అందించేందుకు గాను ఆన్లైన్‌ పర్యవేక్షణ చేసే విధంగా ప్రత్యేక సాఫ్ట్‌ వేర్‌ రూపొందించి, వినియోగించడానికి బోర్డు అనుమతి ఇచ్చింది. దీంతో పాటు ఆరోగ్యశ్రీ రోగులకు ఫేస్‌ రెకగ్నిషన్‌ సాఫ్ట్‌ వెర్‌ వినియోగానికి అనుమతి ఇచ్చింది. బయోమెట్రిక్‌ విధానం వల్ల కొంత ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో మరింత పారదర్శకంగా ప్రజలకు సేవలు అందించేందుకు ఈ విధానం తేవాలని నిర్ణయించింది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....