ములుగు జులై 26, (ఇయ్యాల తెలంగాణ ):ఆకాశం నుంచి జాలు వారే జలపాతం..పాల నురగ లతో పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తున్న పర్యాటక కేం ద్రం. వీకెండ్ హాలిడేస్ వచ్చాయంటే అనేకమంది పర్యాటకులు ఆ జలపాతం వద్ద ఉల్లాసంగా ఉత్సాహం గా గడపడానికి ఇష్టపడుతున్నారు. ఆకాశానికి రంద్రం పడితే ఆకాశంలో నీరంతా భూమి పైకి చేరుతుంది అనే మాదిరిగా ఈ జలపాతం కనబడుతుంది.ఒక్క మాటలో చెప్పాలంటే ఆకా శగంగా అని పురాణాలలో ఏ విధంగా వర్ణించబడిరదో అదే మాదిరిగా ఈ జలపాతం పర్యాట కులను ఎంతగానో కనువిందు చేస్తుంది. తెలంగాణ లోని ములుగు జిల్లా లోని పర్యాటక ప్రాంతాల్లో ఒక్క టైనా మైతాపురం జలపా తం అద్భుతాలకు కేరఫ్ గా నిలుస్తోం ది. అల్లంత దూరం నుంచి జాలువారు తున్న జలపాతాలు పర్యటకులకు రెడ్ కార్పేట్ పరుస్తూ ఆహ్లాదాన్ని అందిస్తూ మైమరిపిస్తున్నాయి.