హైదరాబాద్, ఆగష్టు 19 (ఇయ్యాల తెలంగాణ) : 77వ స్వాత్రంత్ర దినోత్సవం సందర్బంగా ” ఇంటింటా ఇన్నోవేటర్ ” పోటీ ధ్వారా ఎంపికై 4 ఆవిష్కర్తలకు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ప్రశంసించారు. సృజనాత్మాకతను ప్రోత్సహించడంతో పాటు స్థానిక సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నూతన ఆవిష్కరణలకు అవకాశం ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎటా ” ఇంటింటా ఇన్నోవేటర్ ” పోటీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించాలనే ఉదేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఆవిష్కరణలను ప్రోత్స్తహించేందుకు ఆన్లైన్ లో ” ఇంటింటా ఇన్నోవేటర్ ” పోటీ ఏర్పాటు నిర్వహించడం జరిగింది.
ఇందులో గృహిణి నుండి పాఠశాలలు, కళ్లాశాల స్థాయి విద్యార్థులు, విద్యావేత్తలు, వ్యవసాయదా రులు ఇలా ఎవరైనా ఇందులో పాల్గొనవచ్చు.
హైదరాబాద్ జిల్లా నుండి 4 ఆవిష్కర్తలు న్యాయనిరనేతలు ధ్వారా విజేతలుగా ఎంపిక చేయబడింది. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, జిల్లా సైన్స్ అధికారి సి. ధర్మేందర్ రావ్ , ఈడి ఎం. రజిత ఇంటింటా ఇన్నోవేటర్ పోటీలో విజేతలు 4 ఆవిష్కర్తలను తన కలెక్టర్ ఆఫీస్ లో ప్రశంసించారు.
విజేతలు వారి ఆవిష్కరణలు :–
( 1 ) నితిన్ రాజేష్ — మినీ పోర్టబుల్ సోలార్ పంప్
(2 ) గౌతమ్ — టెక్ రెడ్
(3) డాక్టర్ పీ ఝాన్సీ లక్ష్మి — క్రాప్ ప్రొటెక్ట్ ఆంబిరెళ్ల
( 4 ) రఘునందన్ — వరల్డ్ చీపేస్ట్ మినీ లైబ్రరీ.