ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ కేసులో ముగిసిన నారా లోకేష్‌ సిఐడి విచారణ

విజయవాడ అక్టోబర్ 10 (ఇయ్యాల తెలంగాణ):ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ కేసుకు సంబంధించి నారా లోకేష్‌ సీఐడీ విచారణ ముగిసింది. ఉదయం 10 గంటలకు ఆయన విచారణ ప్రారంభం కాగా.. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. దీంతో 6 గంటల పాటు లోకేష్‌ పై సీఐడీ ప్రశ్నల వర్షం కురిపించింది. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌ మెంట్‌ మార్పు, ప్రతిపాదిత రింగ్‌ రోడ్‌ సవిూపంలో హెరిటేజ్‌ భూములు కొనుగోలు, తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి లో పరిసర ప్రాంతాల్లో భూములు కొనుగోలు పై సీఐడీ లోకేషన్‌ ను ప్రశ్నించినట్లు సమాచారం. ఉదయం పూట విచారణ సమయంలో లోకేష్‌ ను ప్రధానంగా 16 ప్రశ్నలు అడగగా.. అందుకు ఆయన చెప్పిన సమాధానాల ఆధారంగా మధ్యాహ్నం కొత్త ప్రశ్నలను అడిగినట్లు తెలుస్తోంది. అయితే.. దాదాపు అనేక ప్రశ్నలకు.. నాకు తెలియదు అని లోకేష్‌ సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ అలైన్మెంట్‌ మార్పు విషయంలో తన ప్రమేయం లేదని ఆయన చెప్పినట్లు సమాచారం.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....