ఈటలకు వై`ప్లస్‌ కేటగిరీ భద్రత.

 .

        

హైదరాబాద్‌  జూలై 1 ,(ఇయ్యాల తెలంగాణ ):  తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కౌశిక్‌ రెడ్డి తన హత్యకు కుట్ర చేస్తున్నారని ఈటల రాజేందర్‌ ఆయన సతీమణి జమున ఆరోపణలు చేసిన నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు వై`ప్లస్‌ భద్రత కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రేపటి నుంచి ఈటలకు వై`ప్లస్‌ కేటగిరీ భద్రత ఉంటుంది.ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు ముప్పు ఉన్నట్లు తెలంగాణ ప్రభుత్వం నిర్ధారించిన విషయం తెలిసిందే. హుజురాబాద్‌తో పాటు జిల్లాల పర్యటనల్లో అనుమానాస్పద కార్లు తిరుగుతున్నాయని ఈటల వెల్లడిరచారు. ఈటల విూడియాకు వెల్లడిరచిన వెంటనే మంత్రి కేటీఆర్‌ స్పందించారు. స్వయంగా చొరవ తీసుకొని డీజీపీకి ఫోన్‌ చేసి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈటలను కలిసి వివరాలను సేకరించినట్లు మేడ్చల్‌ డీసీపీ సందీప్‌ రావు తెలిపారు. ఈటెల భద్రతపై సీల్డ్‌ కవర్లో డీజీపీకి రిపోర్ట్‌ అందజేసినట్లు డీసీపీ పేర్కొన్నారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం వై ప్లస్‌ భద్రత కల్పించింది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....