ఉమ్మడి జిల్లాలో కరోనా కేసు అప్రమత్తమమైన ఆరోగ్యశాఖ

వరంగల్‌ డిసెంబర్ 22 (ఇయ్యల తెలంగాణ );ఉమ్మడి వరంగల్‌ జిల్లా పరిధిలో కరోనా కేసు నిర్ధారణ అయింది. రోగి ప్రస్తుతం ఆక్సిజన్‌ సహాయంతో  ఎంజీఎం కరోనా వార్డులో చికిత్స పొందుతున్నారు. భూపాలపల్లి జిల్లా గణపురం మండలం  గాంధీ నగర్కు చెందిన 62 సంవత్సరాల మహిళ నిమోనియా ఒబేసిటీతో బాధపడుతూ హనుమకొండలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం వచ్చారు. ఇక్కడ ఆర్‌. టి. పి. సి. ఆర్‌ పరీక్ష నిర్వహించడంతో పాజిటివ్గా నిర్ధారణ అయింది. రోగిని వెంటనే ఎంజి ఎం కు తరలించారు. ప్రస్తుతం రోగి ఆక్సిజన్‌ సహాయంతో చికిత్స పొందుతుంది. రోగి నుండి మరో రెండు శాంపిల్స్‌ సేకరించారు. వెరియంట్‌ నిర్ధారణ కోసం  ఒకశాంపిల్‌ ను పూణేకు పంపారు. మరో షాంపిల్‌ ను కాకతీయ వైద్య కళాశాల ఆవరణలోని వైరాలజీ ల్యాబ్‌ కు ఆర్‌. టి. పి. సి. ఆర్‌ నిర్ధారణ కోసం పంపారు. రోగి కూతురు కొడుకు సాంపిల్స్‌ కూడా సేకరించారు.రోగి నిమోనియా,ఓబేసిటీ,బిపి తో బాధపడుతున్నట్లు  ఎంజీఎం వైద్యులు వెల్లడిరచారు. ప్రస్తుతం ఆక్సిజన్‌ సహాయంతో శ్వాస తీసుకుంటుందని యాంటీ వైరల్‌, యాంటీబాక్టీరియల్‌ చికిత్స అందిస్తున్నట్లువైద్యులు తెలిపారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....