ఎలక్టోరల్‌ బాండ్ల జారీకి ఆమోదం

 న్యూఢల్లీ, జూలై 1, (ఇయ్యాల తెలంగాణ ):ఈ ఏడాది చివర్లో రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌, మిజోరం రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎలక్టోరల్‌ బాండ్ల జారీకి ఆమోదం తెలిపింది. దీంతో రాబోయే రెండు నెలల్లోనే ఆయా రాష్ట్రాలకు ఎన్నికల నగారా మోగనుంది. అయితే రాజకీయ విరాళాలకు సంబంధించిన విషయంలో పారదర్శకత తీసుకురావడంతో పాటు.. క్యాష్‌ డొనేషన్లను అరికట్టడం కోసమే ఈ ఎలక్టోరల్‌ బాండ్లను తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ కీలక ప్రకటన చేసింది. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు చెందిన 29 అధికృత బ్యాంకు శాఖల ద్వారా జూలై 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఈ బాండ్లను విక్రయించనున్నట్లు తెలిపింది. లక్నో, బెంగళూరు, డెహ్రాడూన్‌, గాంధీనగర్‌, చెన్నై, ముంబయి వటి తదితర నగరాల్లో ఉన్న ఈ బ్యాంకు శాఖల ద్వారా ఈ ఎలక్టోరల్‌ బాండ్లను విక్రయించనున్నారు. మరో ముఖ్య విషయం ఏంటంటే జారీ చేసిన నాటి నుంచి కేవల 15 రోజుల వరకు మాత్రమే ఈ బాండ్లు చెల్లుబాటులో ఉంటాయి. ఒకవేళ 15 రోజు తర్వాత డిపాజిట్‌ చేసినా అవి చెల్లుబాటు కావు. అయితే 2018 మార్చి 1 నుంచి 10 వ తేది మధ్య ఎలక్టోరల్‌ బాండ్లను జారీ చేశారు. దేశ పౌరులు, దేశంలో ఉండే కంపెనీలు ఈ బాండ్లను కొనుగోలు చేయొచ్చు. లోక్‌సభ లేదా అసెంబ్లీ ఎన్నికల్లో 1 శాతం కంటే ఎక్కువ శాతం పొందిన రాజకీయ పార్టీలకు మాత్రమే ఈ ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా విరాళాలు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....