తుగ్గలి, జనవరి 23 (ఇయ్యాల తెలంగాణ) : త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని జిల్లా స్థాయి అధికారుల ఆదేశాల మేరకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం) పై రెవెన్యూ అధికారులు ఓటర్లకు అవగాహన కల్పించారు. ఈ అవగాహనకార్యక్రమంలో భాగంగా మండల కేంద్రమైన తుగ్గలి లోని పోలింగ్ బూత్ 108, 109,110 మరియు 111 సెంటర్ల యందు విఆర్ఓ రహిమాన్ ఈవీఎం మిషన్లపై ఓటర్లకు అవగాహన కల్పించారు.రాబోయే సార్వత్రిక ఎన్నికలలోఅధికారులు తెలియజేసిన సూచనల ప్రకారం ఓటర్లు ఓటు వేయాలని వీఆర్వో రహిమాన్ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ రాజు,రెవెన్యూ కార్యాలయ సిబ్బంది నెట్టికంటయ్య,గ్రామ ప్రజలు తదితరులుపాల్గొన్నారు.
ఎలక్ట్రానిక్ Voting మిషన్లపై ఓటర్లకు అవగాహన కార్యక్రమం
Leave a Comment