ఒక్క దెబ్బకు రెండు పిట్టలు.. నీరు, కరెంటు కష్టాలకు చెక్‌

అనంతపురం, సెప్టెంబర్‌ 22 (ఇయ్యాల తెలంగాణ ): గ్రావిూణుల వెతలను అర్థం చేసుకున్న ఓ యువకుడు ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్నట్టు.. నీరు, కరెంటు కష్టాలకు చెక్‌పెట్టాడు. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురానికి చెందిన మధు వజ్రకరూర్‌ అనే యువకుడు తాగునీరు, కరెంటును ఉత్పత్తి చేసే గాలిమర (విండ్‌ టర్బైన్‌)ను ఆవిష్కరించారు. ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన ఆయనకు కొత్త ఆవిష్కరణలపై చిన్నప్పటి నుంచి ఆసక్తి ఎక్కువ.పేదలు పడుతున్న తాగునీరు, కరెంటు కష్టాలను తీర్చాలని 16 ఏండ్లుగా కృషి చేస్తున్న ఆయన తాజాగా విజయవంతం అయ్యారు. 2020లో ఆయన అభివృద్ధి చేసిన గాలి మర 30 కిలో వాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసి సుమారు 25 ఇండ్ల కరెంటు కష్టాలను తీరుస్తున్నది. అదే సమయంలో స్వచ్ఛమైన తాగునీరు అందిస్తూ ప్రజల దాహార్తిని తీరుస్తున్నది. రోజూ 80`100 లీటర్ల స్వచ్ఛమైన తాగునీరు దీని ద్వారా అందుతున్నది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....