కరీంనగర్లో NIA సోదాలు

కరీంనగర్‌ ఆగష్టు 10 (ఇయ్యాల తెలంగాణ ):జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) కరీంనగర్‌నగరంలో  సోదాలు నిర్వహించడం కలకలం రేపింది.  కరీంనగర్‌ హుస్సేన్‌ పురాలో గురువారంతెల్లవారుజాము ఐదు గంటలనుంచి ఎన్‌ఐఏ బృందం తనిఖీలు చేపట్టింది. దుబాయి లో వుంటున్న స్థానికుడు తబ్రేజ్‌ ఖాన్‌ అనే వ్యక్తికి పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా ( పీఎఫ్‌ఐ) అనే నిషేధిత సంస్థతో సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో సోదాలు జరిపింది. దాదాపు నాలుగు గంటలపాటు తకిఖీలు జరిపిన ఎన్‌ఐయే బృందం తిరిగి హైదరాబాద్‌ వెళ్లిపోయింది. తనిఖీలో కొన్ని కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....