కవిత దొరసాని తరహాలో వ్యవహరిస్తుంది M P ధర్మపురి అరవింద్‌

నిజామాబాద్‌ అక్టోబర్ 18  (ఇయ్యాల తెలంగాణ ): ఎమ్మెల్సీ కవిత పై ఎంపీ ధర్మపురి అరవింద్‌ మండిపడ్డారు. కవిత దొరసాని తరహాలో వ్యవహరిస్తుంది. మా ఇంటిపై విూ గూండాలను పంపినప్పుడు ఆడపడుచులు గుర్తురాలేదా. ఆ రోజు మా అమ్మ ఒక్కతే ఇంట్లో ఉన్న సంగతి తెలిసే గూండాలను, బ్రోకర్‌ లను దాడికి పంపించావు. కరోనా తో తెలంగాణ ప్రజలు లక్షలు ఖర్చు చేసినప్పుడు ఆరోగ్య శ్రీ, ఆయుష్మాన్‌ భారత్‌ ఎందుకు అమలు చేయడంలేదు. అప్పుడు ప్రజలకు ఒక్కరూపాయి అయినా సాయం చేశారా. నిన్ను కుక్కా అన్నా జైలులో వేసినా ప్రజల నుంచి సింపతీ ఏమి రాదని అన్నారు.మనిషి బ్రతికున్నప్పుడు సాయం చేయరు కాని చనిపోతే 5 లక్షల రూపాయలు భీమా చేస్తారా అని ప్రశ్నించారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....