కార్తికేయునికి షష్ఠి పూజలు : Vijay Prasad

మద్దికేర,మే 14 (ఇయ్యాల తెలంగాణ) : మండల కేంద్రమైన మద్దికేర గ్రామంలో వెలిసిన  శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి షష్టి సందర్భముగా ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆలయ నిర్వాహకులు విజయ్‌ ప్రసాద్‌ యాదవ్‌ తెలిపారు.మంగళవారం వేకువ ఝామున అర్చకులు స్వామివారికి సామూహిక పంచాంభృత అభిషేకాదులు నిర్వహించి, నూతన పట్టువస్త్రాలు ధరింపజేసి, ఆభరణాలతోను, వివిధ రకాల పూలమాలల తోను సుందరంగా అలంకరించి, ప్రత్యేక పూజలు,అర్చనలు నిర్వహించారు.జాతకంలో ఆశ్లేష నక్షత్ర దోషము,కుజదోషం,రాహుకేతు నివారణ,ఉద్యోగ విద్య వ్యాపార అభివృద్ధి కొరకు వివాహ సంతాన ఆరోగ్య సమస్యల కొరకు పలువురు భక్తులు సామూహిక హోమాలు చేశారు.పలువురు భక్తులు ఆలయానికి చేరుకొని స్వామి వారికి కానుకలు సమర్పించుకొన్నారు.ఆలయానికి విచ్చేసిన భక్తాదులకు దాతల సహకారంతో అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....