కాల్పుల విరమణకు అంగీకరించిన Bharath

 అధికారికంగా ప్రకటించిన  భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ 

న్యూ డిల్లీ మే 10 (ఇయ్యాల తెలంగాణ) : పహల్గాం  ఉగ్రదాడి   నేపథ్యంలో గత కొన్ని రోజులుగా భారత్‌`పాకిస్థాన్‌  దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలకు ఇవాళ్టితో తెరపడిరది. కాల్పుల విరమణకు అంగీకరించినట్లు భారత్‌ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ  ఒక ప్రకటన చేశారు. శనివారం సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిందని ఆయన తెలిపారు.ఇవాళ మధ్యాహ్నం 3.35 గంటలకు పాకిస్థాన్‌ డీజీఎంవో, భారత డీజీఎంవో మధ్య ఫోన్‌లో చర్చలు జరిగాయని, రెండు దేశాలు కాల్పుల విరమణను అంగీకరించాయని మిస్రీ వెల్లడిరచారు. ఈ నెల 12న సాయంత్రం 5 గంటలకు ఇరుదేశాల డీజీఎంవోలు మళ్లీ చర్చలు జరుపుతారని చెప్పారు. ఈ సాయంత్రం నుంచి భూ, గగన, సముద్ర తలాల నుంచి ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిందని తెలిపారు.కాగా, భారత విదేశాంగ శాఖ ప్రకటనకు కొద్ది సేపటి ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన సోషల్‌ విూడియా ఖాతాలో సంచలన ప్రకటన చేశారు. భారత్‌, పాకిస్థాన్‌ దేశాలు పూర్తిస్థాయి కాల్పుల విరమణకు ఒప్పుకున్నాయని తెలిపారు. అమెరికా రెండు దేశాలతో రాత్రంతా జరిపిన చర్చలు ఫలించాయని పేర్కొన్నారు. కాల్పుల విరమణకు అంగీకరించినందుకు రెండు దేశాలను అభినందించారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....