కేంద్ర మంత్రి అమిత్‌ షా కు టీపీసీసీ ఛీఫ్‌ రేవంత్‌ రెడ్డి లేఖ

తొమ్మిది  ప్రశ్నలు సంధించిన రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌,మే 14 (ఇయ్యాల తెలంగాణ) : కేంద్ర మంత్రి అమిత్‌ షాకు టీపీసీసీ ఛీఫ్‌ రేవంత్‌ రెడ్డి లేఖ రాసారు. మాటలు కోటలు దాటుతున్నాయి… చేతలు గడప దాటడం లేదు అన్న సామెత కేంద్రంలోని మీ ప్రభుత్వానికి అతికినట్టు సరిపోతుంది.  2022 నాటికి దేశంలో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న విూ హావిూ ఒట్టి బూటకం అని అర్థమైయింది. అన్నదాతల ఆదాయం రెట్టింపు సంగతి అటుంచి విూ పాలనలో వారి పరిస్థితి పెనం విూద నుండి  పొయ్యిలో పడినట్టయింది. రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చిన విూ నిర్ణయాన్ని ప్రతిఘటిస్తూ లక్షలాది మంది రైతులు రోడ్డెక్కారు. ఈ ఉద్యమంలో 700 మందికి పైగా రైతులు ప్రాణాలు వదిలారు. ఎరువుల  సబ్సిడీలు ఎత్తివేసి రైతుల నెత్తిన బరువు మోపింది విూ ప్రభుత్వం. బ్యాంకులను వేల కోట్లకు ముంచిన బడాబాబులు దేశాన్ని వదిలి స్వేచ్ఛగా ఎగిరిపోతుంటే… రైతుల రుణాలను మాత్రం ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. మొత్తంగా విూ పాలనలో వ్యవసాయంలో గుణాత్మక మార్పు అన్నది జీరో అని అయన లేఖలో పేర్కోన్నారు.

ఇక తెలంగాణ విషయానికి వస్తే… బీజేపీ ` టీఆర్‌ఎస్‌ లు ఎనిమిదేళ్లు అంటకాగి రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన పథకాలన్నింటినీ ఇద్దరూ కలిసి విజయవంతంగా తుంగలోతొక్కారు. 2018 అసెంబ్లీ ఎన్నికల  తర్వాత మూడో సారి విూరు తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. వచ్చిన ప్రతిసారీ సెంటిమెంట్‌ డైలాగులే తప్ప తెలంగాణ ప్రజలు, రైతులు, యువత సమస్యల పరిష్కారానికి విూరు ఇచ్చిన మాట లేదు…  చేసిన పనీ లేదు. కేసీఆర్‌ కుటుంబ అవినీతితో ఇప్పటికే వేల కోట్ల తెలంగాణ ప్రజల సంపద దోపిడీకి గురైతే… విూరు చోద్యం చూస్తున్నారు. బొగ్గు స్కాం నుంచి భూముల స్కాం వరకు పలు ఫిర్యాదులు  ఇచ్చినా స్పందించలేదు. ఇటీవల విూ పార్టీ మాజీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి గడ్కరీ వచ్చి కేసీఆర్‌ ప్రభుత్వాన్ని ఆకాశానికెత్తేశారు. విూ పార్టీ రాష్ట్ర నాయకులేమో టీఆర్‌ఎస్‌ తో లడాయి అంటూ తొడలు  కొడుతుంటారు. ఢల్లీిలో దోస్తీ గల్లీలో కుస్తీ చేస్తోన్న విూ రెండు పార్టీల చీకటి సంబంధం తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది. ఈ నేపథ్యంలో… 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత మూడోసారి తెలంగాణకు  వస్తున్న విూకు తెలంగాణ ప్రజలు, రైతులు, యువత తరఫున కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నాను. 

ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ హయాంలో ప్రారంభించిన ప్రాణహిత ` చేవేళ్ల ప్రాజెక్టుకు కాళేశ్వరం అని పేరు మార్చి, రీ డిజైనింగ్‌ పేరుతో కేసీఆర్‌ కవిూషన్లు దండుకుంటున్నారని మేం మొదటి నుండి  ఆరోపిస్తున్నాం. ఈ ప్రాజెక్టు కేసీఆర్‌ కుటుంబానికి ఎటీఎంలా మారింది అని… విూ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఇటీవల పదే పదే వ్యాఖ్యానిస్తున్నారు. అవినీతి జరిగింది అని అంగీకరిస్తున్న  విూరు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? దేశంలో ప్రతిపక్ష నేతలు, విూ సొంత పార్టీలో నిజాలు మాట్లాడే నేతల పై ఈడీ, సీబీఐ ద్వారా కొన్ని గంటల వ్యవధిలోనే దాడులు చేయించే విూరు ఎనిమిదేళ్లుగా  కేసీఆర్‌ కుటుంబ అవినీతిని ఉపేక్షించడం వెనుక రహస్యం ఏమిటో చెబుతారా!? తెలంగాణ రైతులు పండిరచిన ధాన్యం కొనుగోళ్ల విషయంలో విూరు, కేసీఆర్‌ కలిసి మొదట ఒక చీకటి ఒప్పందం చేసుకున్నారు. యాసంగి (2022) నుండి తెలంగాణలో ధాన్యం సేకరణ ప్రభుత్వం  చేయకూడదు అన్నది ఆ ఒప్పందం.  దానికి రైతుకు సంబంధం లేని బాయిల్డ్‌ రైస్‌ అని ఒక వంక తెర విూదకు తెచ్చారు. దానికి అనుగుణంగానే కేసీఆర్‌ కొనుగోలు కేంద్రాలు ఎత్తేశారు. రైతుల వద్ద ధాన్యం  కొంటుంటే ప్రభుత్వానికి రూ.7000 కోట్ల నష్టం వచ్చిందని కుంటి సాకులు చెప్పారు. వరి వేస్తే ఉరే అని హెచ్చరికలు చేశారు. వరి వేస్తే రైతు బంధు ఇవ్వబోమని సంకేతాలు పంపారు. ఇకపై బాయిల్డ్‌ రైస్‌  ఇవ్వబోమని అంగీకారం తెలుపుతూ 2021 అక్టోబర్‌ 4న విూ ఆదేశాల మేరకే ఈఅఎ కి కేసీఆర్‌ లేఖ రాశారు. ఆ లేఖపై క్షేత్ర స్థాయిలో ‘‘కల్లాల్లోకి కాంగ్రెస్‌’’ అని మేం పోరుబాట పట్టడంతో మాటమార్చారు. 

విూ రెండు పార్టీలు కలిసి ఆడిన రాజకీయ డ్రామా కారణంగా గడచిన వానాకాలం నుండి తెలంగాణ రైతులు తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. పదుల సంఖ్యలో రైతులు వడ్ల కుప్పలపై గుండె పగిలి  చనిపోయారు. ఈ మరణాలకు బాధ్యులు విూ రెండు పార్టీలు కాదా!?

గత పార్లమెంట్‌ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సందర్భంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ ఏర్పాటు పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఏర్పాటు, ఉద్యమాన్ని కించ  పరిచేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. దీనిపై టీఆర్‌ఎస్‌ మౌనందాల్చినా… కాంగ్రెస్‌ పక్షాన అప్పుడే మేం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాం. విూరు స్పందించ లేదు. ఇప్పుడు తెలంగాణకు వస్తున్న సందర్భంగా  విూరు ఆ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చి, తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. లేనిపక్షంలో విూ రాకను తెలంగాణ సమాజం ఎట్లా ఆమోదిస్తుందనుకుంటున్నారు? మా ప్రజలకు ఆత్మగౌరవం, ఆత్మాభిమానం  లేదు అని విూరు భావిస్తున్నారా!?

విూ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే నిజామాబాద్‌ జిల్లాలో పసుపుబోర్డు ఏర్పాటు చేయిస్తామని లోక్‌ సభ ఎన్నికల ప్రచార సందర్భంగా విూ పార్టీ అగ్రనేత రాజ్‌ నాథ్‌ సింగ్‌ చెప్పారు. ఆ మేరకు విూ పార్టీ అభ్యర్థి ధర్మపురి  అరవింద్‌ బాండ్‌ పేపర్‌ కూడా రాసిచ్చారు. వీరిద్దరి మాటలు విశ్వసించిన నిజామాబాద్‌ ప్రజలు అరవింద్‌ ను ఎంపీగా గెలిపించారు. మూడేళ్లవుతున్నా పసుపుబోర్డు ఊసే లేదు. దీనికి విూ సమాధానం  ఏమిటి? ఇది ప్రజలను చీట్‌ చేయడం కాదా!?

తెలంగాణ యువతకు ఉపాధి కల్పించే ఐటీఐఆర్‌, రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్‌ ఫ్యాక్టరీ లాంటి బృహత్తర పథకాలకు కాంగ్రెస్‌ సారథ్యంలోని గత యూపీఏ ప్రభుత్వం విభజన చట్ట ప్రకారం హావిూ ఇచ్చింది.  విూరు అధికారంలోకి వచ్చాక ఈ పథకాలన్నింటికీ మంగళం పాడారు. తెలంగాణకు కేంద్రం పదే పదే రిక్తహస్తం చూపిస్తున్నా ఎనిమిదేళ్లుగా టీఆర్‌ఎస్‌ విూరు అనేక సందర్బాల్లో మద్ధతిస్తూ వచ్చింది. ఇది  బహిరంగమే. తెలంగాణ ప్రజలను నిలువునా వంచించిన విూ ఇద్దరినీ మేం ఎందుకు నమ్మాలి… విూకు మా ప్రజలు మద్ధతు ఎందుకు ఇవ్వాలి? విభజన చట్టం హావిూ ఇచ్చిన గిరిజన యూనివర్సిటీకి మోక్షం  ఎప్పుడు?

అయోధ్య నుండి రామేశ్వరం వరకు ఉన్న రాముడి పుణ్యక్షేత్రాలను దర్శించుకునే విధంగా ‘‘రామాయణం సర్క్యూట్‌’’  పేరిట శ్రీ రామాయణ్‌ యాత్ర ఎక్స్‌ ప్రెస్‌ పేరిట రైలును ప్రవేశ పెట్టారు. 7,500 కిలో  విూటర్లు సాగే ఈ సర్క్యూట్‌ లో దక్షిణ అయోధ్యగా ఖ్యాతికెక్కిన మా భద్రాద్రి రాముడుకి చోటు దక్కలేదు. రాష్ట్రానికి చెందిన కిషన్‌ రెడ్డి పర్యాటక శాఖ మంత్రిగా ఉండి కూడా మాకు మొండి చెయ్యి చూపారు.  దీనికి విూ సమాధానం ఏమిటి? భద్రాద్రి రాముడు రాముడు కాదా!? అయోధ్య రాముడు, భద్రాద్రి రాముడు విూ దృష్టిలో ఒక్కరు కాదా!? ఒడిస్సాలోని నైనీ కోల్‌ మైన్స్‌ టెండర్‌ విషయంలో జరిగిన అవినీతిపై మా పార్టీ సహచర ఎంపీ శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి నేను స్వయంగా కేంద్ర బొగ్గుశాఖ మంత్రి, ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు  చేశాను. ఈ కుంభకోణం వెనుక కేసీఆర్‌ కుటుంబ పాత్రపై వివరాలు సమర్పించాం. ఇంత వరకు దీనిపై అతీగతీ లేదు. కారణం ఏమిటి? కేసీఆర్‌ అవినీతి విషయంలో విూరు నిజంగా అంత సీరియస్‌ గా ఉంటే…  అది చేతల్లో ఎందుకు కనిపించడం లేదు?

పొరుగున ఉన్న కర్నాటక రాష్ట్రంలో అప్పర్‌ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చారు. తెలంగాణలో రెండు ప్రధాన ప్రాజెక్టుల్లో ఒక్క దానికి కూడా జాతీయ హోదా ఇవ్వాలన్న ఆలోచన విూకు రాలేదు… అడగే  బుద్ధి టీఆర్‌ఎస్‌ సర్కారుకు లేదు. విూ దుర్మార్గ చట్టాలకు వారి మద్ధతు… వారి అక్రమాలు అవినీతికి విూ మద్ధతు… ఇది కాదా ఎనిమిదేళ్లుగా జరిగింది!? 2014లో మేం అధికారం నుండి దిగిపోయే నాటికి పెట్రోల్‌ ధర రూ.71.41 పైసలు, డీజిల్‌ ధర రూ.55.49 పైసలు. గ్యాస్‌ సిలెండర్‌ ధర రూ.470 ఉన్నది. నేడు పెట్రోల్‌ లీటర్‌ ధర రూ.119.66 పైసలు, లీటర్‌  డీజిల్‌ ధర రూ.105.65 పైసలు. గ్యాస్‌ సిలెండర్‌ ధర రూ.1052 ఎగబాకాయి. విూరు అధికారంలోకి వచ్చాక దశల వారిగా గ్యాస్‌ పై సబ్సిడీని పూర్తిగా ఎత్తేశారు. సామాన్యులు బతికే పరిస్థితి లేదు. ప్రతి రోజు  ఉదయం పెట్రోలియం ధరల పెరుగుదల వార్తతోనే జనం జీవితాలు మొదలవుతున్నాయి. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇలా ధరల పెరుగుదలతో జన చస్తుంటే విూకు చీమకుట్టినట్టైనా అనిపించడం లేదా?  ఈ ధరల్లో 60 శాతం వరకు బీజేపీ ` టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాలు బాదుతున్న పన్నులే ఉన్నాయి. విూరు తగ్గించాలని వారు, వారు తగ్గించాలని విూరు డ్రామాలు చేయడం తప్ప… ప్రజలకు  ఇద్దరు కలిసి ఇస్తున్న ఉపశమనం శూన్యం. ఇంతలా జనాలను పన్నులు, సెస్సులతో చావగొట్టే మిమ్మల్ని మా తెలంగాణ ప్రజలు ఎందుకు క్షమించాలని ప్రశ్నించారు. అమిత్‌ షా గారూ… ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా విూరు తెలంగాణకు ఏ మొఖం పెట్టుకుని వస్తారు? మోసానికి కవల పిల్లలు లాంటి బీజేపీ ` టీఆర్‌ఎస్‌ జిత్తులు, ఎత్తులు గ్రహించ లేని  అమాయకులా తెలంగాణ ప్రజలు? మా ప్రజలకు ఒపిక ఎక్కువ… దానిని అమాయకత్వం అనుకుంటే పొరపాటు. సాయుధ పోరాటం నుండి స్వరాష్ట్ర పోరాటం వరకు ప్రపంచానికే పోరాట పంథాను చూపిన  తెగువగల ప్రజలు మా వాళ్లు. సెంటిమెంట్‌ తో ప్రజల మనోభావాలతో ఆడుకునే ప్రయత్నం చేయాలనుకునే విూ కుతంత్రం ఇక్కడ పని చేయదని  రేవంత్‌ రెడ్డి అన్నారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....