క్రమంగా పుంజుకుంటున్న BJP

అక్టోబర్ 17 (ఇయ్యాల తెలంగాణ ): ఇటు  బీఆర్‌ఎస్‌ అటు కాంగ్రెస్‌ వారివారి సవిూకరణాలలో బిజీగా ఉంటే బీజేపీ మాత్రం తన పనిని చకచక కానిచ్చెస్తోంది. ఇప్పటికే నిజామాబాద్‌ అర్బన్‌ టికెట్‌ ధన్‌పాల్‌ సూర్యనారాయణకు దాదాపు కన్‌ఫామ్‌గా  భావించడంతో..చాపకింద నీరులా బిజెపి ప్రచారంలో దూసుకుపోతోంది. ధన్‌పాల్‌ సూర్యనారాయణ వైశ్య సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయినప్పటికి సమాజంలోని అన్ని వర్గాలకు అతను సుపరిచితుడు.

రాజకీయాలకు అతీతంగా అతను చేసిన సామాజిక సేవకు గుర్తింపుగా నియోజక వర్గంలోని ప్రజలు ముఖ్యంగా యువత అతని వెంట ఉన్నట్టు కనిపిస్తోంది. అంతే కాకుండా ఎంపి అరవింద్‌ సహకారం దాంతో పాటు ఇటీవల ప్రకటించిన పసుపు బోర్డ్‌, మోడీ నిర్వహించిన బహిరంగ సభ బిజెపి యొక్క విజయావకాశాలనను మెరుగుపరిచే అంశాలని చెప్పుకోవచ్చు.  జిల్లాలోని మిగతా నియోజకవర్గాలలో కూడా బిజెపి నాయకులు ప్రచారంలో ముందున్నారు. కాంగ్రెస్‌ పార్టీ తన అభ్యర్థులను నిజామాబాద్‌ అర్బన్‌, రూరల్‌లలో  ప్రకటించక పోవడంతో కొంత గందరగోల పరిస్థితులు నెలకొన్నప్పటికి మిగతా చోట్ల ప్రచారంలో పైచేయి గానే ఉన్నట్లు పార్టీ క్యాడర్‌ భావిస్తోంది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....