గ్రేటర్‌కు Power ఫుల్‌ లేడీ సింగం అమ్రపాలి !

హైదరాబాద్‌, జూన్‌ 25, (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణ ప్రభుత్వం వారం వ్యవధిలోనే మరోమారు ఐఏఎస్‌ల బదిలీలు చేపట్టింది. గత వారం 18 జిల్లాల కలెక్టర్లను మార్చిన ప్రభుత్వం తాజాగా 44 మంది ఐఏఎస్‌లను బదిలీ చేసింది. ఈ క్రమంలో గ్రేటర్‌ హైదరాబాద్‌(జీహెచ్‌ఎంసీ) కమిషనర్‌గా అమ్రపాలిని నియమించింది. ప్రస్తుత కమిషనర్‌ రొనాల్డ్‌ రాస్‌ను ట్రాన్స్‌కో కమిషనర్‌గా బదిలీ చేసింది. తెలంగాణ సర్కార్‌ తాజాగా తీసుకన్న నిర్ణయం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.  తెలంగాణ ప్రభుత్వంలో ఇప్పుడు సీనియర్‌ అధికారుల కన్నా ఎక్కువ పవర్‌ ఫుల్‌గా ఉన్న ఆఫీసర్‌ కాట అమ్రపాలి. తాజా బదిలీల్లో ఆమెను గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కమిషనర్‌గా కూడా నియమించారు. ఇప్పటికే ఆమె  జాయింట్‌ మెట్రోపాలిటన్‌ కమిషనర్‌,  మూసీ రివర్‌ ఫ్రంట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌,  ఊఉఅఒ మేనేజింగ్‌ డైరెక్టర్‌ , హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్‌ కమిషనర్‌ గా కూడా ఉన్నారు. ఆయా పోస్టుల్లో కొత్తగా ఎవరికీ బాధ్యతలు ఇవ్వకపోవడంతో కీలక బాధ్యతలను సీఎం రేవంత్‌ రెడ్డి అప్పగించారని అనుకోవచ్చు.కాట అమ్రపాలి  2010 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ ఆఫీసర్‌. చెన్నై ఐఐటీ నుంచి బీటెక్‌, బెంగళూరు ఐఐఎం నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. అనంతరం 2010 యూపీఎస్‌లో ఆలిండియా 39వ ర్యాంక్‌ సాధించి ఐఏఎస్‌ అయ్యారు. ఈ కారణంగా సొంత రాష్ట్ర క్యాడర్‌నే కేటాయించారు. అయితే ఆంధ్రప్రదేశ్‌ విభజన తర్వాత ఆమెను తెలంగాణ  క్యాడర్‌కు కేటాయించారు. 2013లో వికారాబాద్‌ సబ్‌`కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వంలో కొన్నాళ్లు వరంగల్‌ కలెక్టర్‌ గా వ్యవహరించారు. 2018 ఎన్నికల సమయంలో అదనపు చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌గా పనిచేసిన ఆమ్రపాలి, కేంద్ర ప్రభుత్వంలోకి డిప్యూటీషన్‌ వెళ్లారు. తర్వాత కేంద్ర సర్వీసులకు వెళ్లారుఅమ్రపాలి ప్రస్తుతం హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(హెచ్‌ఎండీఏ)లో జాయింట్‌ మెట్రోపాలిటన్‌ కమిషనర్‌గా ఉన్నారు. ఆమెను జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా నియమిస్తూ సీఎస్‌ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. 

ఇటీవల రొనాల్డ్‌ రోస్‌ సెలవుపై వెళ్లగా అమ్రపాలిని ఇన్‌చార్జిగా నియమించారు. ఆ సమయంలో విధులను సమర్థవంతంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితోపాటు ప్రభుత్వ ప్రజల ప్రశంసలు పొందారు. ఈ క్రమంలో ఆమెను పూర్తి కమిషనర్‌గా నియమిస్తే సమర్థవంతగా పనిచేస్తారని భావించి ఈ నియామకం చేసినట్లు తెలుస్తోంది.అమ్రపాలి సొంత గ్రామం ఒంగోలు నగర చివరన ఉన్న ఎన్‌.అగ్రహారం. కాటా వెంకటరెడ్డి?పద్మావతి దంపతుల మొదటి సంతానం. విశాఖలో ఉన్నత చదువులు చదివారు. ఆంధ్రప్రదేశ్‌ క్యాడర్‌లో 2010 ఏఐఎస్‌ బ్యాచ్‌కు చెందిన అమ్రపాలి రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకే కేటాయించారు. రాష్ట్రంలో పలు జిల్లాల కలెక్టర్‌గా పని చేశారు. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్న సమయంలో కేంద్ర సర్వీస్‌లకు వెళ్లారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక తిరిగి రాస్ట్రానికి వచ్చారు.అమ్రపాలి తన పనితీరుతో లేడీ సింగంగా గుర్తింపు తెచ్చుకున్నారు. విధి నిర్వహణలో చాలా కఠినంగా వ్యవహరిస్తారు. ఎక్కడా రాజీ పడే ప్రసక్తే ఉండదు. అవతలి వాళ్లు ఎలాంటి వారైనా, ఆమె చట్ట ప్రకారం పనిచేసుకుపోతారు. ఎవ్వరినీ కేర్‌ చెయ్యరు. రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాక ఆమెకు కీలక బాధ్యతలను అప్పగిస్తున్నారు. గతేడాది హెచ్‌ఎండీఏ కమిషనర్‌గా నియమితులయ్యారు. 

ఆ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు. 7,200 చదరపు కిలోవిూటర్లు, ఏడు జిల్లాల పరిధిలో ఉన్న హెచ్‌ఎండీఏపై తన మార్కు వేశారు. దీంతో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ప్రమోషన్‌ లభించింది..జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా నియమితులైన అమ్రపాలి ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. సిటీ వేగంగా విస్తరిస్తోంది. జనాభా సంఖ్య పెరుగుతోంది. ట్రాఫిక్‌ సమస్యలు చాలా ఉన్నాయి. కుక్కల పెడద పెరిగింది. వర్షాకాలంలో వరదలు నగరాన్ని ముంచెత్తుతున్నాయి. మ్యాన్‌ హోళ్లు, డ్రెయినేజీలు ప్రమాదకరంగా మారతాయి. ఈ నేపథ్యంలో గ్రేటర్‌ సిటీని అంతర్జాతీయ స్థాయిలో మరింతగా అభివృద్ధి వైపు నడిపించాల్సిన బాధ్యత ఆమెపై ఉంటుంది.ఇక ఆమ్రపాలి భర్త సవిూర్‌ శర్మ ఐపీఎస్‌ అధికారి. 2011 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన ఆయనను 2018 ఫిబ్రవరి 18న పెళ్లి చేసుకున్నారు. సవిూర్‌ శర్మది జమ్మూకశ్మీర్‌. ప్రస్తుతం ఆయన డామన్‌, డయ్యూలో సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌(ఎస్పీ)గా విధులు నిర్వర్తిస్తున్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....