చంద్రబాబు భద్రతపై భయంగా వుంది భువనేశ్వరి

రాజమండ్రి సెప్టెంబర్ 12 (ఇయ్యాల తెలంగాణ ): రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో ఈరోజు చంద్రబాబును నారా భువనేశ్వరి కలిసారు. తరువాత ఆమె విూడియాతో మాట్లాడారు. చంద్రబాబు ఎప్పుడు ప్రజల గురించి ఆలోచించేవాడు. ప్రజల కోసం పోరాడే వ్యక్తిని నిర్బంధించారు ప్రజలంతా చంద్రబాబు వెంటే ఉండాలి. ప్రజలే తనకు ముఖ్యమని చంద్రబాబు ఎప్పుడు అనేవారు.  చంద్రబాబు నిర్మించిన నిర్మాణంలోనే ఆయన్ని కట్టిపడేశారు. టిడిపి ఎన్టీఆర్‌ నిర్మించిన పార్టీ అది ఎక్కడికి పోదు ఎవరు ఏమి చేయలేరు. ఆయన చూసి వచ్చాక ఒక భాగం వదిలేసినట్టు ఉంది. ఏపీ నీ నెంబర్‌ వన్‌ గా నిలబెట్టాలని జీవితాన్ని దార పోశారు. చంద్రబాబు భద్రతపై నాకు భయంగా ఉంది. అయనకు  సరైన వసతులు కల్పించడం లేదని ఆమె అన్నారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....