జూన్‌లో కీలక నిర్ణయం తీసుకోనున్న ఆర్‌బీఐ

ముంబాయి, ఏప్రిల్ 21 (ఇయ్యాల తెలంగాణ) :  భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌  ప్రజలకు మరోసారి ఉపశమనాన్ని ప్రకటించవచ్చు. ఈ ఏడాది జూన్‌ నెలలో ద్రవ్య విధాన కమిటీ సమావేశంలో కూడా, రెపో రేటు పెంపును రిజర్వ్‌ బ్యాంక్‌ నిలిపివేయవచ్చు. ఈ నెల ప్రారంభంలో, 3`6 తేదీల్లో జరిగిన సమావేశం కూడా రెపో రేటును కేంద్ర బ్యాంక్‌ పెంచలేదు, 6.5 శాతం వద్ద యథాతథంగా కొన సాగించింది. దేశంలో ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి గత ఏడాది మే నెల నుంచి ఆర్‌బీఐ వడ్డీ రేట్లను ఎప్పటికప్పుడు పెంచింది. ఈ పెంపు సరిపోతుందని, ఇక కొత్తగా పెంచాల్సిన అవసరం లేదని భారత రెపో రేటును నిర్ణయించే ప్యానెల్‌ సభ్యులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో, జూన్‌ సమావేశంలో కూడా రెపో రేటులో ఎటువంటి మార్పులు చేయకుండా సెంట్రల్‌ బ్యాంక్‌ స్థిరంగా ఉంచుతుందని మార్కెట్‌ భావిస్తోంది.జూన్‌లో జరిగే ద్వైమాసిక (రెండు నెలలకు ఒకసారి) సవిూక్షలో రెపో రేటు పెంచకుండా ఉండాలంటే, రెండు ప్రధాన అంశాలపై సెంట్రల్‌ బ్యాంక్‌ దృష్టి పెడుతుంది.         

1. అసంపూర్తి రుతుపవనాల కారణంగా పంట దిగుబడులు తగ్గి ఆహార ఉత్పత్తుల ధరలు పెరగకూడదు                 

2. ముడి చమురు ధరలు పెరకూడదు 

అంటే, రెపో రేటును నిలకడగా ఉంచడంలో రుతుపవనాలు, ముడి చమురు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పొచ్చు.ఈ ఏడాది ఎల్‌ నినో ప్రభావం కనిపించవచ్చని భారత వాతావరణ విభాగం గతంలోనే హెచ్చరించింది. అంటే, వర్షపాతం తగ్గి ఎండలు మండిపోతాయి. దాని ప్రభావం పంట దిగుబడులపై పడుతుంది. రుతుపవనాల లోపం వల్ల ఏర్పడే ప్రతికూల ప్రభావంతో ద్రవ్యోల్బణం ఎక్కువ స్థాయిలోనే ఉండవచ్చన్నది రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఆరుగురు సభ్యుల ఓఖఅ అభిప్రాయం. అయితే, ప్రతికూల పరిస్థితులను తట్టుకుని పంట ఉత్పత్తి తగ్గకపోయినా లేదా ఆహార పదార్థాల ధరలు పెరగకపోయినా ద్రవ్యోల్బణం అదుపులోనే ఉంటుందని అంచనా.ఒక సంవత్సరం క్రితం గరిష్ట స్థాయులకు చేరిన కమొడిటీల ధరలు ఇప్పుడు బాగా దిగవచ్చాయి. దీనివల్ల.. వస్తు తయారీ కంపెనీలపై పెట్టుబడి వ్యయాల భారం బాగా తగ్గింది. ఫలితంగా వస్తు ధరలు తగ్గుతాయి. రియల్‌ ఎస్టేట్‌ కూడా పుంజుకుంది. కాబట్టి, జూన్‌ సమావేశంలో కూడా రెపో రేటు పెంచకుండా అడ్డుపడే పరిస్థితులు ప్రస్తుతానికి సానుకూలంగానే ఉన్నాయి. 

2.5 శాతం పెరిగిన రెపో రేటు               

గత ఏడాది మే నెల నుంచి ఇప్పటి వరకు, గత 11 నెలల్లో జరిగిన ఆరు విధాన సవిూక్షల్లో రెపో రేటు మొత్తంగా 2.5 శాతం లేదా 250 బేసిస్‌ పాయింట్లు పెంచింది. గత ఏడాది మే నెల నాటికి ఉన్న 4 శాతం నుంచి ఇప్పుడు 6.5 శాతానికి చేరింది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....