తెలంగాణలో చేరికలతో బిజిబిజీగా రాజకీయ పార్టీలు.. సడన్‌గా తెరపైకి కవిత పేరు.. ఇప్పుడే ఎందుకొచ్చిందంటే..!?

  హై దరాబాద్‌ జూన్‌ 26 (ఇయ్యాల తెలంగాణ ):తెలంగాణలో చేరికలతో రాజకీయ పార్టీలన్నీ బిజిబిజీగా ఉంటున్న వేళ సడన్‌గా ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుమార్తె, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు తెరపైకి వచ్చింది. రాష్ట్ర రాజకీయాల్లో కవిత గురించే పెద్ద చర్చ జరుగుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. కవిత.. కవిత.. అంటూ ఆమె చుట్టూనే తెలంగాణ రాజకీయాలన్నీ తిరుగుతున్నాయ్‌. ఈమె పేరు వాడుకొని రానున్న ఎన్ని?కల్లో లబ్ది పొందాలని కాంగ్రెస్‌, బీజేపీలు భావిస్తున్నాయ్‌.. ఇవన్నీ ఒక ఎత్తయితే బీఆర్‌ఎస్‌ కూడా కవిత పేరు వాడుకోవాలని చూస్తోంది. ఇంతకీ తెరపైకి కవిత పేరు ఎందుకొచ్చింది..? రాజకీయ పార్టీలు ఏ ఆలోచనలో ఉన్నాయి? చూస్తే …

దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢల్లీి లిక్కర్‌ స్కామ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొని పలుమార్లు సీబీఐ, ఈడీ విచారణకు ఎమ్మెల్సీ కవిత వెళ్లొచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ వ్యవహారం అప్పట్లో గల్లీ నుంచి ఢల్లీి వరకూ మార్మోగింది. అదిగో అరెస్ట్‌.. ఇదిగో అంతా అయిపోయిందని బీజేపీ రాష్ట్ర నేతలు, అగ్రనేతలు కామెంట్స్‌ చేయని రోజు లేదు. ఇక తెలంగాణలో బండి సంజయ్‌, అరవింద్‌ ఇలాంటి వాళ్లు అయితే నోరు తెరిస్తే ‘కవిత అరెస్ట్‌’ అనే మాట తప్ప మరొకటి రాలేదు. దీంతో ఇక కవిత పని అయిపోయినట్లే.. అరెస్ట్‌ ఖాయం అని తెలంగాణ ప్రజలు భావించారు. అయితే అనుకున్నట్లు మాత్రం ఎందుకో జరగలేదు. ఆ మధ్య బీఆర్‌ఎస్‌`బీజేపీ మధ్య చీకటి ఒప్పందం కుదిరిందని కూడా వార్తలొచ్చాయి. అంతేకాకుండా నిన్న, మొన్నటి వరకూ బీజేపీ గురించి బీఆర్‌ఎస్‌ పొల్లెత్తి మాట అనకపోవడం.. బీఆర్‌ఎస్‌పై కూడా తగిలీతగలకుండా బీజేపీ విమర్శలు జరపడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరినట్లయ్యింది. సరిగ్గా ఈ పరిస్థితుల్లోనే సీబీఐ, ఈడీ ఛార్జ్‌షీట్లలో కవిత పేరు ఎక్కడా లేకపోవడంతో ఇక ఇదే పక్కా అని అందరూ భావించారు. సీన్‌ కట్‌ చేస్తే.. ఇప్పుడు మంత్రి కేటీఆర్‌ స్వయంగా ఢల్లీికెళ్లి మరీ కేంద్ర హోం మంత్రి, బీజేపీలో నంబర్‌`02గా ఉన్న అమిత్‌ షా అపాయిట్మెంట్‌ అడగడంతో మరింత రచ్చ రచ్చ అయ్యింది. దీంతో రెండు పార్టీల్లో అసలేం జరుగుతోందో తెలియక అటు బీజేపీ.. ఇటు బీఆర్‌ఎస్‌ వీరాభిమానులు, కార్యకర్తలు అయోమయంలో పడ్డారు.వరికేం కావాలి..?

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో.. ప్లీజ్‌.. ప్లీజ్‌ కవితను అరెస్ట్‌ చేయండి అని బీఆర్‌ఎస్‌ బతిమలాడే పరిస్థితుల్లో ఉందట. ఎందుకంటే బీజేపీకి త్రివిధ దళాలు అని ఆరోపణలు వస్తున్న ఐటీ, ఈడీ, సీబీఐలను ఉసిగొల్పి సోదాలు చేయిస్తోందని ప్రతిపక్ష పార్టీలు దుమ్మెత్తిపోస్తున్నాయి. చాలా రోజులుగా బీఆర్‌ఎస్‌ కూడా.. కేంద్రాన్ని టార్గెట్‌ చేస్తూ మాట్లాడిన సందర్భాలున్నాయ్‌. వాస్తవానికి అప్పట్లో అధికార పార్టీ టార్గెట్‌గా చేసిన సోదాలతో పలువురు నేతలు బీజేపీలో చేరిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఈ మధ్య అలాంటిదేవిూ జరగట్లేదు. దీనికి కారణం కవితను అడ్డుపెట్టుకుని మూడు పార్టీలు రాజకీయం చేస్తున్నాయి గనుక. కవిత అరెస్ట్‌ అయితే బాగుంటుందని.. ఆ సింపతీతో ఎన్నికల్లో పనికొస్తుందని బీఆర్‌ఎస్‌ భావిస్తోందట. ఇప్పటికే.. ఈ విషయాలన్నింటినీ జనాల్లోకి గులాబీ నేతలు బాగానే తీసుకెళ్లారు. ఈ పరిస్థితుల్లో కవిత అరెస్ట్‌ అయితే అన్నివిధాలుగా కలిసొస్తుందని బీఆర్‌ఎస్‌ భావిస్తోందట. అంటే.. కవిత అరెస్ట్‌ను రాజకీయ అస్త్రంగా, సెంటిమెంట్‌ రగిలించడానికి బీఆర్‌ఎస్‌ రెడీ అయ్యిందన్న మాట.

` మరోవైపు.. కవిత పేరును అడ్డుపెట్టుకుని ఎన్నికల్లో లబ్ధి పొందాలని కాంగ్రెస్‌, బీజేపీ కూడా భారీ ప్లానింగ్‌లోనే ఉన్నాయి. ఎందుకంటే.. బీజేపీ`బీఆర్‌ఎస్‌ మధ్య రహస్య ఒప్పందం ఉందని ఇప్పటికే కాంగ్రెస్‌ జనాల్లోకి బాగా తీసుకెళ్లింది. ఎన్నికల వరకూ కవిత అరెస్ట్‌ కాకపోతే.. ఇది చీకటి ఒప్పందమే అని జనాల్లోకి తీసుకెళితే పార్టీకి అదే ప్లస్‌ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని కాంగ్రెస్‌ అగ్రనేతలు భావిస్తున్నారట. ఇలా అస్తమాను కాంగ్రెస్‌ నేతలు విమర్శలు గుప్పిస్తుండటంతో బీజేపీ ఆత్మరక్షణలో పడిపోయిందట. ఒకవేళ కవిత అరెస్ట్‌ జరగకపోతే.. కన్నడనాట ‘పే సీఎం’ పేరుతో ప్రచారం 

మొదలెట్టి బీజేపీని కుప్పకూల్చిన వ్యూహకర్త సునీల్‌ కనుగోలు.. తెలంగాణలో ఏ రేంజ్‌లో ప్లాన్‌ చేస్తారో ఒక్కసారి ఊహించుకోండి..!

` ఇక బీజేపీ విషయానికొస్తే.. కర్ణాటక ఫలితాల తర్వాత తెలంగాణ బీజేపీలో పరిస్థితులు చాలావరకు మారాయన్నది జగమెరిగిన సత్యమే. ఒకప్పటికి, ఇప్పటికీ మార్పులు, చేర్పులు జరిగాయ్‌. నిన్న మొన్నటి వరకూ ‘మేమే ప్రధాన ప్రతిపక్షం.. మేమే బీఆర్‌ఎస్‌ను ఢీకొట్టేది.. మేమే నంబర్‌`02’ అని చెప్పుకున్న కమలనాథులు ఇప్పుడు ఆ మాటలు చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. అందుకే ఇప్పట్లో కవితను అరెస్ట్‌ చేస్తే మాత్రం అసలుకే ఎసరు వస్తుందని బీజేపీ భావిస్తోందట. అరెస్ట్‌ చేస్తే జనాల్లో బీజేపీకి ఉన్న పేరు కచ్చితంగా పోతుందని.. ఇన్నాళ్లు పార్టీ బలోపేతం కోసం కష్టపడిన శ్రమ మొత్తం 

వృథా అవుతుందని నేతలు అనుకుంటున్నారట. కవిత విషయంలో అగ్రనేతలు సరైన నిర్ణయం తీసుకోవట్లేదని.. చాలా మంది అసంతృప్తికి లోనవుతున్నారు. ఇప్పుడు కీలక నేతలు ఈటల రాజేందర్‌, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఈ విషయంలోనే హర్టయ్యి పార్టీని వీడేంత పరిస్థితి వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే కవితను అరెస్ట్‌ చేయకపోవడమే బీజేపీకి పెద్ద మైనస్‌ అయ్యిందని సొంత పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారట. ఇక బీఆర్‌ఎస్‌ కూడా అప్పట్లో బీజేపీ కీలక నేత బీఎల్‌ సంతోష్‌ను అరెస్ట్‌ చేసినంత పనిచేసి.. చివరికి చప్పుడు చేయలేదు. ఇలా చెప్పుకుంటూ బీజేపీ`బీఆర్‌ఎస్‌ల మధ్య చీకటి ఒప్పందం ఉన్నది పదే పదే రుజువు అవుతోందని రాజకీయ విశ్లేషకులు.. ఇరు పార్టీల కార్యకర్తల నుంచి వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం బీజేపీ పరిస్థితే అదేదో పాట ఉందే 

‘అయ్యయ్యో చేతిలో డబ్బులు పాయెనే’ అన్నట్లుగా.. అందొచ్చిన అవకాశాన్ని చేజేతులారా వదులుకున్నదేమో అనే విమర్శలు, ఆరోపణలు లేకపోలేదు.

తెలంగాణలో ఇప్పటి వరకూ బీజేపీని బలోపేతం చేసుకోవడానికి ఏ చిన్న అవకాశం వచ్చినా సద్వినియోగం చేసుకున్న కమలనాథులు.. కవితను అరెస్ట్‌ చేసే సువార్ణవాకాశం వచ్చినా వాడుకోలేదు. దీంతో జనాల్లో బీఆర్‌ఎస్‌`బీజేపీ మధ్య ఏదో నడుస్తోందనే చర్చ ఎప్పుడో మొదలైపోయింది. మరోవైపు.. ఈ మధ్య కేసీఆర్‌ పదే పదే కాంగ్రెస్‌ను టార్గెట్‌ చేస్తూ మాట్లాడుతుండటం.. అదే బాటలో మంత్రులు, పార్టీ నేతలు కూడా నడవడంతో లోలోపల ఏమేం జరుగుతోందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదేమో అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బహుశా ఇప్పుడు బీజేపీ మనసు మార్చుకుని కవితను అరెస్ట్‌ చేయాలని అనుకున్నా కథ ఎలా ఉంటుందో ఇక చెప్పక్కర్లేదేమో. ఇంకా ఎన్నికలకు కాస్త సమయం ఉంది కదా.. ఈ లోపు ఎన్నెన్ని పరిణామాలు చోటుచేసుకుంటాయో ఏంటో.. వేచి చూడాల్సిందే మరి.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....