తెలంగాణ చాలా జాగరూకతతో వ్యవహరించే సమాజం BRS MLC కల్వకుంట్ల కవిత

బోధన్‌ అక్టోబర్‌ 18 (ఇయ్యాల తెలంగాణ ); తెలంగాణ చాలా జాగరూకతతో వ్యవహరించే సమాజమని, ఈ చైతన్యం కలిగిన ప్రజలు అని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు..బోధన్‌లో నిర్వహించిన కార్యకర్తల సమావేశం అనంతరం ఆమె  విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల వచ్చినప్పుడు వచ్చి కాంగ్రెస్‌ నేతలు ఏదో నాలుగు ముచ్చట్లు చెప్పి దానితో నాలుగు ఓట్లు వస్తాయని అనాలోచితమైన చర్య అని విమర్శించారు.నిజామాబాద్‌ జిల్లాలో బీఆర్‌ఎస్‌ పార్టీ ఎంత బలంగా ఉందంటే? ఎక్కడెక్కడి నాయకులు ఇక్కడికి వస్తున్న దాన్నిబట్టి చూస్తే అర్థమవుతుంది. మొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చారని, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ వస్తున్నారని, వచ్చే వారందరికీ స్వాగతం తెలిపారు. వచ్చే వారందరికీ స్వాగతం చెబుతున్నాం. వచ్చి విూరు ఏం చెప్తారో చెప్పండి. టూరిస్టులు వచ్చి చూడండి? నిజామాబాద్‌ మొత్తం తిరగండి. నిజామాబాద్‌ లో పచ్చబడ్డ పొలాలను చూడండి. మంచిగైన కాలువలను చూడండి. నిండుకుండలా ఉన్న ఎస్సారెస్పీని చూడండి. అన్నీ చూసి వెళ్లిపోండి కానీ ఇక్కడ ఉన్న సుహృద్భావ వాతావరణం చెడగొట్టకండి అని సూచించారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....