దేశవ్యాప్తంగా నాలుగో దశ Electionలో 67.70 శాతం Polling

 

ఎపిలో 78.25 శాతం, తెలంగాణలో 64.93 శాతం :కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడి

న్యూ డిల్లీ మే 14 (ఇయ్యాల తెలంగాణ) : కేంద్ర సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా దేశవ్యాప్తంగా మే 13 మంగళవారం నాలుగో దశ పోలింగ్‌ జరిగింది. మొత్తం 10 రాష్ట్రాల్లోని 96 స్థానాలకు జరిగిన నాలుగో దశ ఎన్నికల్లో 67.70 శాతం పోలింగ్‌ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడిరచింది. ఈ మేరకు నాలుగో దశ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా నమోదైన పోలింగ్‌ వివరాలను విడుదల చేసింది.ఈసీ తెలిపిన వివరాల ప్రకారం ఎపిలో 78.25శాతం, తెలంగాణలో 64.93, ఒడిశాలో 73.97, రaార్ఖండ్‌లో 65.31, బిహార్‌లో 57.06, మహారాష్ట్రలో 59.64, యూపీలో 58.05, పశ్చిమ బెంగాల్‌లో 78.44, జమ్మూకశ్మీర్‌లో 37.98, శాతం పోలింగ్‌ నమోదైంది.  కాగా, కొన్ని రాష్ట్రాల్లో నిన్న అర్థ రాత్రి పోలింగ్‌ జరిగినట్లు తెలిపింది. పోలింగ్‌ సమయంలోపు పోలింగ్‌ కేంద్రాల వద్ద వరసల్లో నిల్చున్న ఓటర్లను పోలింగ్‌కు అనుమతించారు. దీంతో పోలింగ్‌ శాతం పెరిగే అవకాశముందని ఈసీ పేర్కొంది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....