నరసరావు పేటలో దారుణం


గుంటూరు, అక్టోబరు 21, (ఇయ్యాల తెలంగాణ ); ఏపీ పల్నాడు జిల్లాలో తీవ్ర విషాదం జరిగింది. ప్రసవ వేదన అనుభవించిన ఓ గర్భిణీ 3 గంటలుగా 3 ఆస్పత్రుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. చివరకు 70 కి.విూల దూరంలోని ఓ ఆస్పత్రిలో చేర్చగా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే, తోడుగా వచ్చిన ఆమె భర్త డబ్బులు తీసుకువస్తానని వెళ్తూ ప్రమాదానికి గురయ్యాడు. ఈ క్రమంలో స్థానికులు అతన్ని తన భార్య ప్రసవించిన ఆస్పత్రికే చికిత్స కోసం తరలించగా, ఇంతలోనే ప్రాణాలు కోల్పోయాడు. బిడ్డను కళ్లారా చూడక ముందే తండ్రి కన్నుమూశాడని కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

పల్నాడు జిల్లా కారంపూడికి చెందిన రామాంజిని అనే మహిళకు పురిటి నొప్పులు రావడంతో శుక్రవారం రాత్రి 10 గంటలకు ఆమెను స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ సదుపాయాలు సరిగా లేవని గురజాల ప్రభుత్వాస్పత్రికి వెళ్లాలని వైద్యులు సూచించారు. దీంతో రాత్రి 11 గంటలకు గురజాల ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే, అక్కడ కూడా సదుపాయాలు లేవని నరసరావుపేట ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సిఫారసు చేశారు. దీంతో చేసేదేవిూ లేక గర్భిణీని కుటుంబ సభ్యులు 70 కిలోవిూటర్ల దూరంలోని నరసరావుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దారి పొడవునా ఆమె 3 గంటలుగా నరకయాతన అనుభవించింది. ఆస్పత్రిలో రామాంజిని పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. అయితే, గురజాల వరకూ గర్భిణీకి తోడుగా వచ్చిన ఆమె భర్త ఆనంద్‌ ఇంటికి వెళ్లి డబ్బులు తెస్తానని బయలుదేరాడు. బైక్‌ పై ఇంటికి వెళ్లి తిరిగి వస్తూ మార్గమధ్యంలో జోలకల్లు వద్ద రహదారిపై భారీ గుంతలో పడి తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు, బాధితున్ని నరసరావుపేట ప్రభుత్వాస్పత్రికే చికిత్స కోసం తరలించారు. ఆస్పత్రి వద్దకు చేరగానే ఆనంద్‌ మృతి చెందాడు. దీంతో బంధువులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.తనకు పుట్టిన బిడ్డను కనులారా చూడకుండానే ఆనంద్‌ కన్నుమూశాడని బంధువులు విలపించారు. భార్యను దగ్గరుండి చూసుకోవాల్సిన సమయంలో ఇలా జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. అత్యవసర సమయంలో గర్భిణీలకు సాధారణ కాన్పులు కూడా చేయలేని స్థితిలో కారంపూడి, గురజాల ఆస్పత్రులు ఉన్నాయని విమర్శించారు. ప్రసవం కోసం 70 కి.విూల దూరంలోని ఆస్పత్రికి వెళ్లాల్సి రావడం బాధాకరమని వాపోయారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....