కమాన్ పూర్ 25 (ఇయ్యాల తెలంగాణ ); రామగిరి మండలంలోని బేగంపేట గుట్టపై గల సయ్య దిన బీర్ పహాని బాబా ఉర్సు ఉత్సవాలు శుక్రవారం నుండి ప్రారంభం కానున్నాయి. గురువారం సాయంత్రం ఫాతిహా కార్యక్రమం నిర్వహించి ప్రారంభిస్తారు. శుక్రవారం రోజున సందన్ శనివారం రోజున ఉరుసు ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ వర్షం ఉత్సవాలకు దర్గాను పూర్తిగా ముస్తాబు చేశారు విద్యుత్ దీపాలతో అలంకరించారు కింది నుండి గుట్ట పై వరకు భక్తుల సౌకర్యార్థం విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. త్రాగునీటి సౌకర్యం కల్పించారు. అలాగే శుక్రవారం రోజున సందల్(గంధం) బేగంపేట కాజీపేట వరంగల్ కాగజ్ నగర్ మంథని తధాల ప్రాంతాల నుండి తీసుకువచ్చి పీర్ పాడి బాబా వారికి సమర్పిస్తారు. కాగా ఈ ఉర్సు ఉత్సవాలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు మహారాష్ట్ర ఉమ్మడి ఆదిలాబాద్ వరంగల్ నుండి భక్తులు హాజరవుతారు. శనివారంతో ఉరుసు ఉత్సవాలు ముగుస్తాయి.
- Homepage
- Telangana News
- నేటి నుండి పీర్ పహాడీ బాబా దర్గా ఉరుసు ఉత్సవాలు
నేటి నుండి పీర్ పహాడీ బాబా దర్గా ఉరుసు ఉత్సవాలు
Leave a Comment