నేడు అ ఫ్రీడమ్‌ ఫైటర్‌ జయంతి, మహనీయురాలు దుర్గాబాయి దేశ్‌ ముఖ్‌

 
  జులై 15, (ఇయ్యాల తెలంగాణ ): స్త్రీల అభ్యున్నతి కోసం ఎనలేని కృషి చేసిన మహనీయురాలు దుర్గాబాయి దేశ్‌ ముఖ్‌, వారు పేరుపొందిన స్వాతంత్య్ర సమరయోధురాలే కాకుండా ఒక సామాజిక కార్యకర్త కూడ. ఆంధ్రప్రదేశ్‌ లోని రాజమండ్రిలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జూలై 15, 1909 న కృష్ణవేణమ్మ, రామారావు దంపతులకు దుర్గాబాయి జన్మించారు. పది సంవత్సరాల వయస్సులోనే హిందీలో పాండిత్యాన్ని సంపాదించి, హిందీ పాఠశాలను నెలకొల్పి అన్ని వయసులవారికీ విద్యాబోధన అందించేవారు. బెనారస్‌ విశ్వవిద్యాలయం నుండి మెట్రిక్యులేషన్‌, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఎం.ఏ (పొలిటికల్‌ సైన్స్‌లో), 1942లో ఎల్‌. ఎల్‌.బి పూర్తిచేసింది.న్యాయశాస్త్రం చదివి మద్రాసులో హైకోర్టు వద్ద ప్రాక్టీసు ప్రారంభించింది దుర్గాభాయి దేశముఖ్‌ రాజకీయ నాయకురాలు కూడా ఆమె భారతదేశం యొక్క రాజ్యాంగ సభ మరియు భారతదేశం యొక్క ప్రణాళికా సంఘం సభ్యురాలు. దుర్గాబాయి చిన్ననాటి నుండే స్వాతంత్య్ర పోరాటంలో పాలుపంచుకుంది. తెలుగుగడ్డ పై మహాత్మా గాంధీ రాకను పురస్కరించుకుని 12 ఏళ్ళ వయసులోనే ఈమె విరాళాలను సేకరించి ఆయనకు అందజేసింది. మహాత్ముని సూచన మేరకు ఏ మాత్రం ఆలోచించకుండా తన చేతులకు ఉన్న బంగారు గాజులను కూడా విరాళంగా అందజేసింది. ఈమె స్థాపించిన రెండు ఆసుపత్రులు, మూడు పాఠశాలలు, రెండు కాలేజీలు నేటికీ స్త్రీ అభ్యున్నతి కోసం ఎనలేని కృషి చేస్తున్నాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయం దుర్గాబాయికి 1971లో గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేసింది.  స్త్రీల అభ్యున్నతి కోసం   ఈమె ఆధ్వర్యంలో 1937లో చెన్నైలో ఆంధ్ర మహిళా సభ స్థాపించబడిరది. ఈమె 1941లో ఆంధ్ర మహిళ పత్రికను స్థాపించి, సంపాదకత్వ బాధ్యతలను నెరవేర్చింది. 1923లో కాకినాడలోని కాంగ్రెస్‌ సభలకు వాలంటీరుగా పనిచేస్తూ నెహ్రూ వద్ద టిక్కెట్‌ లేని కారణము చేత ఆయనను అనుమతించక, తన కర్తవ్య నిర్వహణకు గాను ఆయన నుండి ప్రశంసలను పొందింది. ఆ పై మహాత్ముని ఆంధ్ర పర్యటనలలో ఆయన హిందీ ఉపన్యాసాలను తెలుగులోకి అనువదించింది. ఉప్పు సత్యాగ్రహములో పాల్గొని అరెస్టు కాబడిరది. భారత రాజ్యాంగ నిర్మాణ సభలో 1946 నుండి 1950 వరకు సభ్యురాలిగా పనిచేసిన పిమ్మట, 1952లో ప్లానింగ్‌ కమిషన్‌ సభ్యురాలిగా పనిచేసారు. ఆ సందర్భములో సి.డి.దేశ్‌ముఖ్తో కలిగిన పరిచయం పరిణయానికి దారి తీసింది. వీరి వివాహము 1953 జనవరి 22న జరిగింది. ఈవిడ 1953 ఆగస్టులో భారత ప్రభుత్వంచే నెలెకొల్పబడిన కేంద్ర సాంఘిక సంక్షేమ బోర్డుకు (సెంట్రల్‌ సోషల్‌ వెల్ఫేర్‌ బోర్డ్‌) వ్యవస్థాపక అధ్యక్షురాలిగా పనిచేసారు. ఢల్లీిలో ఉన్న బ్లైండ్‌ రిలీఫ్‌ అసోసియేషన్‌కు అధ్యక్షురాలిగా పనిచేసారు. వీరి స్వీయచరిత్ర భాషించిన శిలలు అన్న పేరుతో వెలువడిరది. 1958లో హైదరాబాదులో ఆంధ్ర మహిళా సభను స్థాపించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మహిళా వసతిగృహ ఏర్పాటుకై పాటుపడటమేగాక రాష్ట్రమంతటా ఎన్నో కళాశాలలు, వసతిగృహాలు, నర్సింగ్‌ హోమ్‌లు మరియు వృత్తి విద్యాకేంద్రాలు నెలకొల్పారు. . ఆంధ్ర విశ్వవిద్యాలయంనుండి గౌరవ డాక్టరేట్‌1971 ` నెహ్రూ లిటరసీ అవార్డు వయోజన విద్యాసేవలకు గుర్తింపుగా వచ్చింది. ఈమెకు1975 సంవత్సరంలో భారతప్రభుత్వం పద్మ విభూషణ్‌ అవార్డును ఇచ్చి  సత్కరించింది. అదే సంవత్సరం ఆవిడ భర్త సి.డి.దేశ్‌ముఖ్‌ కూడా పద్మ విభూషణ్‌ పొందారు. ఈమె చిత్రంతో భారతప్రభుత్వం ఒక తపాలబిళ్ళను విడుదల చేసింది.ఈమె జాÊఙపకార్థం రాజమండ్రిలోని కోటిపల్లి బస్టాండు వద్ద గల స్వాతంత్య్ర సమరయోధుల పార్కులో దుర్గాబాయ్‌ దేశ్‌ ముఖ్‌ విగ్రహంను స్థాపించారు. కేంద్ర సాంఘిక సంక్షేమ బోర్డు వారు 1998లో ఈవిడ పేరున డా.దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ అవార్డును నెలకొల్పారు. ఈ వార్షిక అవార్డు మహిళాభ్యున్నతికి పాటుపడే స్వచ్ఛంద సంస్థకై ఉద్దేశించబడిరది. ఢల్లీిలో ఉన్న బ్లైండ్‌ రిలీఫ్‌ అసోసియేషన్‌ వారు 2006లో ఈవిడ పేరున దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ కాలేజ్‌ ఆఫ్‌ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ను నెలకొల్పారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 1987లో నెలకొల్పబడిన సెంటర్‌ ఫర్‌ ఉమెన్స్‌ స్టడీస్‌ 2006లో డా.దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ సెంటర్‌ ఫర్‌ ఉమెన్స్‌ స్టడీస్‌గా నామాంతరం చెందింది. చైతన్య సేవా స్రవంతిగా అందరినోటా కీర్తించబడ్డ దుర్గాబాయి…1981 మే 9వ తేదీన హైదరాబాదులో పరమపదించారు. మరణంలేని ఓ వ్యవస్థగా ఆమె ఎప్పుడూ మనమధ్యనే చిరస్థాయిగా జీవించి ఉన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....