పశు వైద్య, పశు సంవర్ధక శాఖను పునఃవ్యవస్థీకరణ చేయాలి : VVS

  

మంత్రి సీతక్క ను కలసిన పశు వైద్యాధికారులు

హైదరాబాద్‌ జనవరి 24 పశువైద్య డ పశు సంవర్ధక శాఖ లో పని చేస్తున్న పశు వైద్యాధి కారు లు ( విఏఎస్‌ )లకు  25 సంవత్సరాల సర్వీసు పూర్తి అవుతున్నా పదోన్నతులు లేవు కాబట్టి శాస్త్రీయ పద్ధతిలో పునఃవ్యవస్థీకరణ  చేసి  ప్రమోషన్‌ ఇప్పించాలని తెలంగాణ గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ సభ్యులు విజ్ఞప్తి చేశారు.  ఈ మేరకు బుదవారం పంచాయత్‌ రాజ్‌ శాఖ మంత్రి దనసరి అనసూయ(సీతక్క) ను కలసి వినతి పత్రం ను సమర్పించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గెజిటెడ్‌ ఆఫీసర్‌ సభ్యులు డా .కే.రామారావు , డా.రమేష్‌ బాబు,డా నరసింహ రావు, డా . శ్రీధర్‌ రెడ్డి, డా నాగయ్య,డా చంద్రా రెడ్డి డా.భాను నాయక్‌ డ డా.కిరణ్‌ కుమార్‌ గార్ల ఆధ్వర్యంలో  కలిసి వినతి పత్రం సమర్పించారు.

రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి డా.మల్లు రవిని కలిసిన ప్రతినిధులు

తదనంతరం డా.మల్లు రవి ని కలసి వినతి పత్రాన్ని సమర్పించారు. అందుకు మల్లు రవి  సానుకూలంగా స్పందించారు. శాస్త్రీయ పద్ధతిలో రిఆర్గనేషన్‌ చేస్తేనే ప్రమోషన్‌ త్వరగా వచ్చే అవకాశం ఉందని ,కావున   త్వరగా రీఆర్గనైజేషన్‌ చేయాలని కోరారు. ఉ.ూ.ఔనీ.317 వల్ల ఇబ్బందులు పడుతున్న వారిని స్థానికతను బట్టి ఆయా జిల్లాలకు తిరిగి కేటాయించాలని కోరారు. అలాగే పెండిరగ్‌లో ఉన్న ఉద్యోగుల బకాయిలు అన్ని వెంటనే చెల్లించాలని కోరడం జరిగింది.,పి ఆర్‌ సి ని సకాలంలో ఇవ్వాలని విజ్ఞప్తి చేయగా వ మంత్రి  డా.మల్లు రవి సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....