పాతనగరంలో 2 days నీటి సరఫరా బంద్ !

హైదరాబాద్,జనవరి 18 (ఇయ్యాల తెలంగాణ) : పాతనగరంలోని పలు ప్రాంతాలలో రెండు రోజుల పాటు మంచి నీటి సరఫరా నిలిపి వేయనున్నట్లు మెట్రో వాటర్ వర్క్స్ బోర్డు ప్రకటించింది. కృష్ణ ఫేజ్ -1 మీరాలం,అలియాబాద్ వాటర్ ట్యాంక్ ల పరిధిలో మెయిన్ పైప్ లైన్ ల మరమ్మత్తుల కారణంగా రెండు రోజుల పాటు మంచి నీటి సరఫరాకు అంతరాయం కలుగనున్నట్లు వాటర్ బోర్డు ప్రకటించింది. జనవరి 20, 21 వ తేదీలలో కుళాయిలు వచ్చే ప్రాంతానికి నీటి సరఫరా నిలిచి పోనున్నట్లు తెలియంది. పాతబస్తీ లోని అలియాబాద్, సుల్తాన్ షాహీ, గౌలిపురా మొఘల్ పుర, బహదూర్ పుర, జహ్నుమ, రియాసత్ నగర్, భవాని నగర్, శాలిబండ తదితర ప్రాంతాలలో నీటి సరఫరాకు రెండు రోజులు అంతరాయం కలుగనున్నట్లు ప్రజలు సహకరించాలని కోరారు.  

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....