పులి దాడిలో రైతు మృతి

కొమురం భీమ్‌, నవంబర్ 15 (ఇయ్యాల తెలంగాణ) : కొమురం భీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లా లో పులి దాడి లో  పంట చెనులో పని చేస్తున్న  సిడం భీం మృతి చెందాడు.  జిల్లాలో రోజురోజుకు పెరిగిపోతున్న పెద్దపులి దాడులు  జిల్లావాసులు భయాందోళనలో వున్నారు. అసిఫాబాద్‌ జిల్లా వాంకిడి మండలం చౌపన్‌ గూడ గ్రామ పంచాయతీ పరిధిలోని ఖానాపూర్‌ గ్రామానికి చెందిన సిడాం భీము తండ్రి నారు (69) పత్తి చేనులో కాపలా ఉండే సమయంలో అకస్మాత్తుగా పెద్ద పులి దాడి చేసి కొంత దూరం ఈడ్చుకెళ్ళింది దీంతో అక్కడికక్కడే సిడం  భీం మృతి చెందాడు… మృతునికి ముగ్గురు కుమారులు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు గత సంవత్సరం నవంబర్‌ 11 న దిగిడలో చేపల వేటకు వెళ్లిన విఘ్నేష్‌ ను, నవంబర్‌ 29 న అదే అటవి ప్రాంతంలోని కొండపల్లి ప్రాంతంలో నిర్మల అనే యువతి పై దాడి చేసి హతం చేసిన బెబ్బులి.. రోజురోజుకు  చేను పనులకు వెళ్లాలంటేనే జంకుతున్న రైతులు మాటు వేసి చూస్తున్న పులులు ఏ పక్క నుంచి వచ్చి దాడి చేస్తుందో నన్న భయంతో రైతులు  వణికి పోతున్నారు….

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....