పెరగనున్న గ్యాస్‌ బంఢ ధర

హైదరాబాద్‌ జూలై 1, (ఇయ్యాల తెలంగాణ ): సామాన్యుడు ఈ నెలలోనూ వంట గది మంటను భరించాల్సిందే. ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు (ూఓఅలు) ఈసారి కూడా కొంచమైనా కనికరం చూపలేదు. ఓవైపు కిరాణా సరుకులు, మరోవైపు కూరగాయల రేట్లు కొండెక్కి కూర్చున్నాయి. కనీసం గ్యాస్‌ రేట్లయినా తగ్గుతాయేమోనని ఆశగా ఎదురు చూసిన దేశ జనానికి తీవ్ర నిరాశ తప్పలేదు. ఎల్‌పీజీ   సిలిండర్‌ల కొత్త రేట్లను ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు ప్రకటించాయి. ఇండియన్‌ ఆయిల్‌ వెబ్‌సైట్‌ ప్రకారం, 14.2 కిలోల సిలిండర్‌, 19 కిలోల వాణిజ్య సిలిండర్‌ ధరలో  ఎటువంటి మార్పు చేయలేదు. అయితే, ఈ రేట్లు ఇప్పటికే పీక్‌ స్టేజ్‌లో ఉన్నాయి, సాధారణ ప్రజలకు మోయలేని భారంగా తయారయ్యాయి.ూఓఅలు ప్రతి నెలా 1వ తేదీన కొత్త గ్యాస్‌ రేట్లను ప్రకటిస్తుంటాయి. అంతర్జాతీయ స్థాయిలో ధరలు భారీగా తగ్గినా, మన దేశంలో మాత్రం గ్యాస్‌ రేట్లను ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు తగ్గించడం లేదు. గతంలో వచ్చిన నష్టాలను సర్దుబాటు చేసుకుంటున్నామని, అందువల్లే రేట్లు తగ్గించడం కుదరదని చెబుతున్నాయి.ఈ ఏడాది మే, జూన్‌ నెలల్లో కలిపి కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ రేటును రూ.255.50 మేర ూఓఅలు తగ్గించాయి. అయితే, అంతకుముందు మార్చి 1వ తేదీన ఒక్కో వాణిజ్య సిలిండర్‌ రేటును ఒక్కసారే రూ.350.50 పెంచాయి.దేశ రాజకీయ రాజధాని దిల్లీలో కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ (బ్లూ సిలిండర్‌) రేటు రూ. 1773గా ఉంది. దేశ రాజకీయ రాజధాని ముంబైలో రూ. 1,725, కోల్‌కతాలో రూ. 1,875.50, చెన్నైలో ధర రూ. 1,937 వద్ద ఉన్నాయి.సామాన్యులు ఉపయోగించే డొమెస్టిక్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధరను ఈ ఏడాది మార్చి నెలలో రూ. 50 పెంచిన ఓఎంసీలు, ఆ తర్వాత ఇక తగ్గించలేదు. ప్రస్తుతం, దేశీయ ఎల్‌పీజీ సిలిండర్‌ (రెడ్‌ సిలిండర్‌) ధర హైదరాబాద్‌లో రూ. 1,155గా ఉంది. దిల్లీలో రూ. 1,103, ముంబైలో రూ. 1,102.5, చెన్నైలో రూ. 1,118.5, బెంగళూరులో రూ. 1,105.5, శ్రీనగర్‌లో రూ. 1,219, లెప్‌ాలో రూ. 1,340, ఐజ్వాల్‌లో రూ. 1,260, భోపాల్‌లో రూ. 1,108.50, జైపుర్‌లో రూ. 1,106.50, బెంగళూరులో రూ. 1,105.50 గా ఉంది. దేశంలోని మిగిలిన నగరాల్లోనూ దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి. 16.2 కేజీల దేశీయ ఎల్‌పీజీ సిలిండర్‌ ధర పట్నాలో రూ. 1,201, కన్యాకుమారిలో రూ. 1,187, అండమాన్‌లో రూ. 1,179, రాంచీలో రూ. 1,160.50, దెహ్రాదూన్‌లో రూ. 1,122, ఆగ్రాలో రూ. 1,115.5, చండీగఢ్‌లో రూ. 1,112.5, అహ్మదాబాద్‌లో రూ. 1,110, సిమ్లాలో రూ. 1,147.50, లఖ్‌నవూలో రూ. 1,140.5 చొప్పున విక్రయిస్తున్నారు. రవాణా ఛార్జీలతో పాటు, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నుల వల్ల ఒక్కో రాష్ట్రంలో సిలిండర్‌ రేట్లు ఒక్కోలా ఉంటాయి. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....