నిర్మల్, జూలై 27 (ఇయ్యాల తెలంగాణ) : కడెం ప్రాజెక్టు డేంజర్ జోన్ లో చిక్కుకుంది. ప్రాజెక్ట్ విూద నుండి ఓవర్ వరద నీరు ఫ్లో అవుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కడెం ప్రాజెక్టు ఇన్ ఫ్లో సామర్థ్యం 3.50 లక్షల క్యూసెక్కులు కాగా 6.04 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం కడెం ప్రాజెక్టులోకి వస్తోంది. దీంతో దిగువ ప్రాంతాల పూర్తిగా జలమయంలో దిక్కుకున్నాయి.
గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుకుంతోంది. జలాశయాల నిండు కుండల్లా కనిపిస్తున్నాయి. తెలంగాణ, నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు ప్రస్తుతం ఆందోళనకరంగా ఉంది. ఎగువ నుంచి వచ్చే వరదలతో పాటు భారీ వర్షాలతో అంచనాలకు మించి ఉగ్రరూపం దాల్చింది. ప్రాజెక్టు పైనుంచి నీరు ప్రవహిస్తుండటం అధికారులను ఆందోళనకు గురిచేస్తుంది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించిన అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సవిూక్షిస్తున్నారు.