ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ ని విజయవంతంగా మళ్లీ భూ కక్ష్యలోకి. ఇస్రోకి అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ

న్యూ ఢల్లీ డిసెంబర్‌ 7 (ఇయ్యాల తెలంగాణ ): చంద్రుడి దక్షిణ ధ్రువంపై పరిశోధనలే ధ్యేయంగా భారత్‌ ప్రవేశపెట్టిన చంద్రయాన్‌ ? 3  విషయంలో ఇస్రో మరో రికార్డు క్రియేట్‌ చేసింది. చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టిన ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ ని విజయవంతంగా మళ్లీ భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. అయితే ఈ ప్రయోగాన్ని మొదట అనుకోలేదని ఇస్రో సైంటిస్టులు తెలిపారు.చంద్రుడి ఉపరితలంపై ప్రయోగాలకోసం పంపిన ఈ మూన్‌ మిషన్‌ తాజా రికార్డు మరింత లోతుగా ప్రయోగాలు చేయడానికి ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. జాబిల్లిపై నమూనాలు సేకరించి అక్కడ నుంచి తిరిగి వచ్చే మిషన్‌ కోసం ప్రణాళికలు రూపొందించేందుకు ప్రొపల్షన్‌ మాడ్యూల్లోని అదనపు సమాచారం ఉపయోగపడుతుందని చెబుతున్నారు.ఈ ఏడాది జులై 14న శ్రీహరికోటలోని సతీశ్‌ ధావన్‌ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి చంద్రయాన్‌`3 మిషన్‌ను ఇస్రో ప్రయోగించింది. అది విజయవంతం కావడంతో ప్రొపల్షన్‌ మాడ్యుల్‌, ల్యాండిరగ్‌ మాడ్యుల్‌ వేరయ్యాయి. ఆగస్టు 23న జాబిల్లిపై ల్యాండర్‌ విజయవంతంగా దిగింది. ల్యాండిరగ్‌ మాడ్యుల్‌లోని విక్రమ్‌ ల్యాండర్‌, ప్రజ్ఞాన్‌ రోవర్‌ అక్కడ 15 రోజులు పరిశోధనలు కొనసాగించి తరువాత నిద్రాణ స్థితిలోకి చేరుకున్నాయి.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....