బంగారు నగల పేరుతో విదేశీ మహిళను మోసగించిన Rajasthan నగల వ్యాపారి

జైపూర్‌, జూన్‌ 14, (ఇయ్యాల తెలంగాణ) : అమెరికాకు చెందిన చెరిష్‌ అనే మహిళ జైపూర్‌లోని జోహ్రీ బజార్‌లో బంగారు దుకాణం యజమాని నుంచి బంగారు పాలిష్‌తో కూడిన అభరణాలను కొనుగోలు చేసింది. అయితే వాటికి అక్షరాలా 6 కోట్ల రూపాయలు వెచ్చించింది. విదేశీ మహిళను ఆ నగల వ్యాపారి నిట్ట నిలువునా మోసం చేశాడు, నాణ్యమైన బంగారు నగల పేరుతో ఒకటి కాదు రెండు కాదు ఆరు కోట్ల రూపాయల దోపిడికి పాల్పడ్డాడు. అమెరికాలో ఆ మహిళ ఓ ఎగ్జిబిషన్‌లో ఆ ఆభరణాలను ప్రదర్శించింది. ఈ క్రమంలో అవి నకిలీవని తేలింది. వాటి విలువ కేవలం 300 మాత్రమేనని తెలిసి షాక్‌కు గురైంది. వెంటనే సదరు మహిళ జైపూర్‌కి వచ్చి షాప్‌ యజమాని గౌరవ్‌ సోనీని నిలదీసింది.దుకాణం యాజమాని ఆమె ఆరోపణలను కొట్టిపారేసాడు. దీంతో చెరిష్‌.. జైపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలాగే యూఎస్‌ ఎంబసీ అధికారుల నుంచి కూడా సహాయం కోరింది. స్పందించిన అధికారులు ఈ విషయాన్ని పరిశీలించవలసిందిగా జైపూర్‌ పోలీసులను కోరారు. 2022లో ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా గౌరవ్‌ సోనీతో పరిచయం ఏర్పడిరదని.. గత రెండేళ్లుగా ఆభరణాల కోసం ? 6 కోట్లు చెల్లించినట్లు ఆ మహిళ పోలీసులకు తెలిపింది. ప్రస్తుతం గౌరవ్‌, అతని తండ్రి రాజేంద్ర సోనీ పరారీలో ఉండగా.. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. వారి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....