బరిలో 90 శాతం మంది కోటీశ్వరులే.

హైదరాబాద్‌, నవంబర్‌ 1, (ఇయ్యాల తెలంగాణ ); తెలంగాణలోని 119 ఎమ్మెల్యేలలో 90 శాతం అంటే 106 మంది ఎమ్మెల్యేలు కోటీశ్వరులేనని అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిపోర్ట్‌ (ంఆఖీ) సంస్థ వెల్లడిరచింది. బీఆర్‌ఎస్‌ పార్టీలో ఉన్న 101 మంది ఎమ్మెల్యేలలో 93 మంది, ఏడుగురు ఎంఐఎం ఎమ్మెల్యేలలో అయిదు మంది, ఆరుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలలో నలుగురు, ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేల ఆస్తులు అలాగే ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేల సగటు ఆస్తులను ఏడీఆర్‌ సంస్థ ప్రకటించింది. కాగా ఈ రిపోర్ట్‌ ఆధారంగా తెలంగాణ సిట్టింగ్‌ ఎమ్మెల్యేల సగటు ఆస్తి రూ.13.57 కోట్లుగా ఉంది. ఇక పార్టీల పరంగా చూస్తే బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల సగటు ఆస్తి రూ.14.11 కోట్లు, ఎంఐఎం ఎమ్మెల్యేల సగటు ఆస్తి రూ.10.84 కోట్లు, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల సగటు ఆస్తి రూ.4.22 కోట్లు, ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేల సగటు ఆస్తి అత్యధికంగా రూ.32.61 కోట్లు, ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేల సగటు ఆస్తి రూ.4.66 కోట్లుగా సంస్థ పేర్కొంది.అత్యధిక ఆస్తులున్న సిట్టింగ్‌ ఎమ్మెల్యేలలో రూ.161 కోట్లతో నాగర్‌ కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌ రెడ్డి అగ్రస్థానంలో ఉండగా ఆ తర్వాతి స్థానాల్లో రూ.91 కోట్లతో పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌ రెడ్డి, రూ.91 కోట్లతో భువనగిరి ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్‌ రెడ్డి ఉన్నారు. ఇక బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ ఆస్తుల వివరాలకు వస్తే రూ.41 కోట్ల ఆస్తులు ఉండగా రూ.27 కోట్ల అప్పు ఉంది. సీఎం కేసీఆర్‌ కు రూ.23 కోట్ల ఆస్తి ఉండగా రూ.8 కోట్ల అప్పు ఉన్నట్లు సంస్థ వెల్లడిరచింది. బీజేపీ నేత హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఆస్తుల వివరాలకు వస్తే ఆయనకు రూ.56 కోట్లు ఆస్తి ఉండగా రూ.8 కోట్ల అప్పు ఉంది.ఇక యాకుత్పురా ఎమ్మెల్యే సయ్యద్‌ అహ్మద్‌ పాషా ఖాద్రీకి రూ.19 లక్షల విలువైన ఆస్తులతో రాష్ట్రంలోనే తక్కువ ఆస్తులున్న ఎమ్మెల్యేగా ఉన్నారు. అతని తర్వాత ఇద్దరు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఉన్నారు. రవిశంకర్‌ సుంకే (చొప్పదండి) కేవలం రూ.20 లక్షలతో, ఆత్రం సక్కు (ఆసిఫాబాద్‌) దాదాపు రూ.27 లక్షలతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.లయబిలిటీస్‌ లో రూ. కోటికి పైగా ఉన్న ఎమ్మెల్యేల జాబితాలో రూ.94 కోట్లతో పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌ రెడ్డి టాప్‌ లో ఉన్నారు. తర్వాతి స్థానంలో రూ.63 కోట్లతో నాగర్‌ కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌ రెడ్డి, రూ.40 కోట్లతో దానం నాగేందర్‌ ఉన్నట్లు అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిపోర్ట్‌ సంస్థవెల్లడిరచింది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....