బిజీ బిజీగా ప్రధాని

న్యూఢల్లీ, సెప్టెంబర్‌ 17, (ఇయ్యాల తెలంగాణ );బర్త్‌డే రోజు కూడా బిజీబిజీగా గడుపుతున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఢల్లీి ఎయిర్‌పోర్ట్‌ మెట్రో ఎక్స్‌ప్రెస్‌ లైన్‌ ఎక్స్‌టెన్షన్‌ని ప్రారంభించిన ఆయన…ఆ తరవాత యశోభూమి ఎక్స్‌పో సెంటర్‌నీ ప్రారంభించారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఎక్స్‌పో సెంటర్‌గా ఇది రికార్డుకెక్కింది. ఈ నిర్మాణం కోసం కేంద్రం దాదాపు రూ.5 వేల కోట్లకుపైగా ఖర్చు చేసింది. ఈ ఎనిబివతీనిజీబితినీనిజీశ్రీ అనీనిలవనిబితినీని జీనిట ఇలీజూనీ అవనిబితీవకే యశోభూమిఅని నామకరణం చేసింది కేంద్ర ప్రభుత్వం. మొత్తం 8.9 లక్షల చదరపు విూటర్ల పరిధిలో ఈ ప్రాజెక్ట్‌ని నిర్మించారు. కళ్లు చెదిరిపోయే కన్వెన్షన్‌ సెంటర్‌తో పాటు ఎగ్జిబిషన్‌ హాల్స్‌నీ ఇందులో ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ స్థాయిలో సదస్సులు, సమావేశాలు నిర్వహించేందుకు వీలుగా ప్రధాని మోదీ ప్రత్యేక చొరవతో ఈ నిర్మాణం చేపట్టారు.  1.8 లక్షల చదరపు విూటర్ల మేర నిర్మాణం జరిగింది. ఇందులో కన్వెన్షన్‌ సెంటర్‌ని 73 వేల చదరపు విూటర్ల విస్తీర్ణంలో నిర్మించారు. ఇందులో మెయిన్‌ ఆడిటోరియంతో కలిపి 15 కన్వెన్షన్‌ రూమ్స్‌ ఉంటాయి. గ్రాండ్‌ బాల్‌రూమ్‌తో పాటు 13 విూటింగ్‌ రూమ్స్‌ నిర్మించారు. 11 వేల మంది ప్రతినిధులు కూర్చున్నా ఎలాంటి ఇబ్బంది లేకుండా విశాలంగా నిర్మాణం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముందు ఢల్లీి మెట్రోలో ప్రయాణించారు ప్రధాని. ప్రయాణికులతో కాసేపు మాట్లాడి వాళ్లతో సెల్ఫీలు దిగారు. ఈ ఎక్స్‌పో సెంటర్‌ని ప్రారంభించిన తరవాత అక్కడి కళాకారులతో మాట్లాడారు ప్రధాని. ప్రదర్శనకు ఉంచిన ప్రతి వస్తువు గురించి అడిగి తెలుసుకున్నారు. స్వయంగా మోదీ వచ్చి తమతో మాట్లాడినందుకు వాళ్లంతా ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ప్రెసిడెంట్‌ మల్లికార్జున్‌ ఖర్గే, ఎంపీ రాహుల్‌ గాంధీ సహా పలువురు కీలక నేతలు ట్వీట్‌లు చేశారు. ప్రధాని మోదీ ఆయురారోగ్యాలతో ఉండాలని విషెస్‌ చెప్పారు. తల్లి లేకుండా ప్రధాని మోదీ జరుపుకుంటున్న తొలి పుట్టిన రోజు ఇదే. ఇటీవలే ఆమె కన్నుమూశారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....