భరోసా కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి హరీష్‌ రావు

సిద్దిపేట సెప్టెంబర్ 30 (ఇయ్యాల తెలంగాణ ); సిద్ధిపేటలో భరోసా కేంద్రాన్ని  మంత్రి హరీష్‌ రావు, డీజీపీ అంజనీ కుమార్‌ శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, సిద్దిపేట సీపీ శ్వేత, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గోన్నారు.మంత్రి హరీష్‌ రావు మాట్లాడుతూ భరోసా భవనాన్ని మహిళ సంరక్షణ సముదాయంగా వాడుకుందాం. బాధితులు ఎవరైనా ఇక్కడికి వచ్చి అన్ని రకాలుగా న్యాయం పొందవచ్చు. సీఎం కేసీఆర్‌ ఆలోచనలను పోలీస్‌ డిపార్ట్‌ మెంట్‌ తుచా తప్పకుండా పాటిస్తున్నారని అన్నారు. డీజీపీ అంజనీ కుమార్‌ మాట్లాడుతూ 2014 తరువాత రాష్ట్ర ప్రభుత్వం కమిట్‌ మెంట్‌ తో పనిచేస్తుంది. ఈ భరోసా, సఖి లాంటి ప్రభుత్వ పథకాలు ఏ రాష్ట్రంలో లేవు. ఈ సెంటర్‌ లు మహిళలలకు, చిన్న పిల్లలకి  ఎంతగానో ఉపయోగపడుతాయని అన్నారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....