భారత్‌ చంద్రుడిని చేరితే.. పాక్‌ అడుక్కునే స్థితికి చేరింది నవాజ్‌ షరీఫ్‌

లండన్‌ సెప్టెంబర్‌ 20 (ఇయ్యాల తెలంగాణ ): తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్థాన్‌ పై ఆ దేశ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. పొరుగు దేశమైన భారత్‌ అన్ని రంగాల్లోనూ పురోగమిస్తుంటే.. పాకిస్థాన్‌ పరిస్థితి మాత్రం నానాటికీ దిగజారుతోందన్నారు. భారత్‌ చందమామను చేరుకోవడంతోపాటు ప్రతిష్ఠాత్మక జీ20 సమావేశాలను నిర్వహించిందన్నారు. అయితే పాక్‌ మాత్రం అడుక్కునే స్థితికి చేరిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.ప్రస్తుతం లండన్‌లో ఉన్న ఆయన లాహోర్‌లోని పార్టీ కార్యకర్తలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొని మాట్లాడారు. ‘పాకిస్థాన్‌ ప్రధాని నేడు ఆ దేశానికి, ఈ దేశానికి తిరుగుతూ నిధుల కోసం అడుక్కుంటున్నారు. భారత్‌ మాత్రం అసాధ్యాలను సుసాధ్యం చేస్తూ అన్ని రంగాల్లోనూ దూసుకెళ్తోంది. చంద్రుడిని చేరింది. ప్రతిష్ఠాత్మక జీ20 సదస్సుకు ఆతిథ్యమిచ్చింది. భారత్‌ చేయగలిగింది పాకిస్థాన్‌ ఎందుకు చేయలేకపోతోంది..? ఈ దారుణ పరిస్థితులకు ఎవరు బాధ్యులు..?’ అని సూటిగా ప్రశ్నించారు.అటల్‌ బిహారీ వాజ్‌పేయూ ప్రధాని అయినప్పుడు భారత్‌ వద్ద విదేశీ మారక నిల్వలు కేవలం ఒక్క బిలియన్‌ డాలర్లు మాత్రమే ఉండేదని నవాజ్‌ షరీఫ్‌ గుర్తు చేశారు. కానీ, ఇప్పుడు భారత్‌ విదేశీ మారకం విలువ 600 బిలియన్‌ డాలర్లకు చేరిందని ఆయన వివరించారు. భారత్‌ ఉన్నత స్థాయికి చేరితే పాక్‌ మాత్రం అడుక్కునే స్థితికి ఎందుకు చేరుకుంది..? అని ఆయన ప్రశ్నించారు. పాకిస్థాన్‌ లో ఆర్థిక సంక్షోభానికి మాజీ సైనిక జనరల్స్‌, న్యాయమూర్తులే కారణమని షరీఫ్‌ ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....