మహాత్మా గాంధీకి నివాళులర్పించిన సీఎం KCR

హైదరాబాద్‌ అక్టోబర్ 2 (ఇయ్యాల తెలంగాణ ):మహాత్మా గాంధీ 154వ జయంతి (అక్టోబర్‌ 2) సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు అయనకు  నివాళులర్పించారు. దేశ స్వాతంత్య్రానికి, తద్వారా జాతి నిర్మాణానికి గాంధీజీ అందించిన అమూల్యమైన సేవలను, చేసిన త్యాగాలను సీఎం కేసీఆర్‌ ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ‘సత్యమేవ జయతే’ అనే  విశ్వాసం ప్రేరణగా, దేశ ప్రజలకు గాంధీజీ అందించిన  ఆశయాలు, సిద్ధాంతాలు, కార్యాచరణ, విజయాల స్పూర్తి, తెలంగాణ రాష్ట్ర సాధనలోనూ, అనంతర స్వరాష్ట్ర  ప్రగతి ప్రస్థానంలోనూ ఇమిడి వున్నదని సీఎం కేసీఆర్‌ తెలిపారు.  వ్యవసాయం, సాగునీటి రంగాల అభివృద్ధితో, పునరుజ్జీవం చెందిన కులవృత్తులతో బలోపేతమైన గ్రావిూణ ఆర్థికాభివృద్ధితో , ఆసరానందుకుంటున్నపేదల, పెద్దల చిరునవ్వులతో.,.. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యానికి  తెలంగాణ పల్లెలు ప్రతి రూపాలుగా నిలిచాయని సిఎం అన్నారు.  గాంధీజీ సిద్ధాంతాలను, కార్యాచరణను జీవన విధానంలో భాగం చేసుకుని స్వీయ నియంత్రణ, అనుసరణలతో ముందుకు సాగడమే ఆయనకు మనమనిచ్చే ఘనమైన నివాళి అని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....