ప్రత్యేక సమావేశాల్లో కీలక బిల్లులను తీసుకు రానున్నందున అధికారులపై ఈ ఆంక్షలను విధించినట్లు తెలుస్తోంది. లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం వల్ల ప్రజాధనం ఆదా అవుతుందని.. ఎన్నికల నుంచి పరిపాలనా దృష్టిని అభివృద్ధిపై మళ్లించవచ్చని లా కమిషన్ ఇప్పటికే సూచించింది. ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం వల్ల దేశం నిరంతరం ఎన్నికల మోడ్ లో ఉండకుండా నిరోధించవచ్చు. అందువల్ల పరిపాలన దృష్టి అభివృద్ధి పైనే ఉంటుందని లాకమిషన్ నివేదిక సూచించింది. కానీ ప్రస్తుత రాజ్యాంగ చట్టంలో వన్ నేషన్.. వన్ ఎలక్షన్ నిర్వహించడం సాధ్యం కాదని కూడా కమిషన్ నివేదికలో పేర్కొంది. ఇది జరగాలంటే రాజ్యాంగంలో సవరణ అవసరం అని తెలిపింది. అందుకే రాజ్యాంగ సవరణల బిల్లును ప్రవేశపెడతారని వార్తలు వస్తున్నాయి. అయితే జమిలీ ఎన్నికలు నిర్వహించాలంటే రాజ్యాంగంలో కనీసం ఐదు అధికరణలను సవరించాల్సి ఉంటుందని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్రామ్ మేఫ్ువాల్ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో రాజ్యసభలో వెల్లడిరచారు. అయితే ఆ సవరణల కోసమే సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు ఐదు రోజుల పాటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించనుందనే టాక్ వినిపిస్తోంది. ఈ సమావేశాల్లో రాజ్యాంగంలోని ఐదు అధికరణలను సవరించి..జమిలి బిల్లు తీసుకొచ్చే అవకాశాలున్నాయని ఎక్కువ మంది నమ్ముతున్నారు. ఈ ప్రకటన వచ్చిన కొద్ది గంటల్లోనే వన్ నేషన్ ? వన్ ఎలక్షన్ బిల్లు పెడతారంటూ వార్తలు హల్చల్ చేశాయి. ఇదంతా నిజమా? అబద్దమా అంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుండగానే మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం కమిటీ కూడా ఏర్పాటు చేసింది. దీంతో అంతటా ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. ముఖ్యమైన విషయాలు అంశాలు ఉన్నాయనే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేశామన్న కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి వ్యాఖ్యలు మరింత ఉత్కంఠ రేపుతున్నాయి.
అటు జమిలి ఎన్నికలు వార్తలపై ఆయా పార్టీల నుంచి భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఓడిపోతామనే భయంతోనే బీజేపీ జమిలి జపం చేస్తుందన్నారు తెలంగాణ మంత్రి తలసాని. అటు వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా సాధ్యమని ప్రశ్నించారు. సీపీఐ నేతలు. రాజ్యాంగాన్ని ఇష్టం వచ్చినట్టు మార్చడానికి వీల్లేదంటున్నారు సీపీఐ నేతఅటు ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందంటున్న విపక్ష కూటమి.. సిద్ధమవుతోంది. ముంబైలో జరిగిన ఇండియా కూటమి కీలక నిర్ణయాలు తీసుకుంది. పలు కమిటీలు వేసిన ఇండియా కూటమి.. సాధ్యమైనంత త్వరగా సీట్లు సర్దుబాటు చేసుకోవాలని తీర్మానం చేసింది. ఇండియా కూటమి అంటే 60శాతం ప్రజలు అంటున్న రాహుల్ గాంధీ విజయంపై ధీమా వ్యక్తం చేశారు.మొత్తానికి దేశ రాజకీయాల్లో రాబోయే పార్లమెంట్ సమావేశాలు కీలకమలుపు కాబోతున్నాయా? ముందస్తు వచ్చినా సంచలనమే? వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు పెట్టినా అంతకుమించిన ప్రకంపనలే పుట్టిస్తాయనడంలో సందేహం లేదు. మరి ఏది నిజం కాబోతుంది?. కానీ కేంద్రం ఏం చేయాలనుకుంటే అది చేయగలుగుతుంది. ఎందుకంటే అధికారం కేంద్రం చేతుల్ల ?ఉంది. ఒక వేళ ప్రజావ్యతిరేకమైనా ఆమోదిస్తే బీజేపీ పెద్దలు మూల్యం చెల్లించుకుంటారు.