ముంబై, జూన్ 10 (ఇయ్యాల తెలంగాణ) : ముంబై విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు మహిళా ప్రయాణికుల వద్ద రూ.19.15 కోట్లు విలువ చేసే 32.79 కేజీల బంగారాన్ని గుర్తించారు. లోదుస్తులు, బ్యాగుల్లో 72 బిస్కెట్లను తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. బంగారాన్ని స్వాధీనం చేసుకొని వారిద్దరిని అరెస్టు చేసినట్లు వెల్లడిరచారు.