మైత్రీ Movie మేకర్స్‌ టైటిల్‌ ‘8 వసంతాలు’

మైత్రీ మూవీ మేకర్స్‌, ఫణీంద్ర నర్సెట్టి సినిమా ఆసక్తికరమైన టైటిల్‌ ‘8 వసంతాలు’

మోస్ట్‌ సక్సెస్‌ ఫుల్‌  పాన్‌ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ హై బడ్జెట్‌లో స్టార్‌ హీరోల సినిమాలను నిర్మించడంతో పాటు,  ఆసక్తికరమైన వినూత్నమైన కాన్సెప్ట్‌లతో కూడిన చిత్రాలనీ రూపొందిస్తున్నారు. వాలంటైన్స్‌ డే సందర్భంగా ఫణీంద్ర నర్సెట్టితో కొత్త చిత్రాన్ని అనౌన్స్‌ చేశారు. అవార్డ్‌ విన్నింగ్‌ బ్లాక్‌ బస్టర్‌ షార్ట్‌ ఫిల్మ్‌ మధురం తీసి, విమర్శకుల ప్రశంసలు అందుకుని, ‘మను’ సినిమాతో తన ఫీచర్‌ ఫిల్మ్‌ దర్శకుడిగా అరంగేట్రం చేసిన ఫణీంద్ర నర్సెట్టి ‘8 వసంతాలు’ అనే మరో ఆసక్తికరమైన చిత్రంతో రాబోతున్నాడు.8 వసంతాలు అంటే ‘8 స్ప్రింగ్స్‌’, ఈ న్యూ ఏజ్‌ రోమాన్స్‌ డ్రామా, ఇది 8 సంవత్సరాల కాలంలో కాలక్రమానుసారంగా సాగే కథనం, ఒక అందమైన యువతి జీవితంలోని ఒడిదుడుకులు, ఆసక్తికరమైన ప్రయాణాన్ని ఎక్స్‌ ఫ్లోర్‌ చేయనుంది.  టైటిల్‌, టైటిల్‌ పోస్టర్‌తో దర్శకుడు తన వినూత్న కోణాన్ని చూపించాడు. ‘‘365 రోజులని అంకెలతో కొలిస్తే ఒక సంవత్సరం? అదే అనుభవాలతో కొలిస్తే, ఒక వసంతం’’ అని పోస్టర్‌లో ఉంది. టైటిల్‌ పోస్టర్‌లో వర్షంలో తడుస్తున్న గులాబీ కనిపిస్తుంది. నవీన్‌ యెర్నేని, వై రవి శంకర్‌ నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్‌, పోస్టర్‌ ఆసక్తిని రేకెత్తించాయి. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను తర్వాత వెల్లడిరచనున్నారు మేకర్స్‌.
iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....