మోడీ చేపడతామన్న జనగణన, కులగణన పై నిజాంపేట BJP హర్షం !

నిజాంపేట్ , మే 03 (ఇయ్యాల తెలంగాణ) : ప్రధాని నరేంద్ర మోడీ జనగణన, కుల గణన ప్రక్రియ కొనసాగిస్తామని, అత్యంత పకడ్బందీగా కుల గణన చేపడతామని ప్రకటించడంతో నరేంద్ర మోడీ చిత్ర పటానికి నిజాంపేట్ బిజెపి అధ్యక్షుడు బిక్షపతి యాదవ్ గారి ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. నిజాంపేట్ హనుమాన్ టెంపుల్ దగ్గర దేశ ప్రధాని మోడీ చిత్ర పటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. దేశ సౌభాగ్యం కోసం నరేంద్ర మోడీ తీసుకుంటున్న సాహసోపేత నిర్ణయాలు ప్రపంచములోకెల్లా భారత దేశ ఔన్నత్యాన్ని పెంచుతోందని కొనియాడారు  ఈ కార్యక్రమంలో బిజెపి ఓబీసీ సెల్ నిజాంపేట్ అధ్యక్షులు పొట్లకాయల వెంకటేశ్వర్లు ముదిరాజ్, బిజెపి కార్యకర్తలు ఈ కార్య క్రమంలో పాల్గొన్నారు.  

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....