రాజీవ్‌ గాంధీ బతికి ఉంటే ఎప్పుడో Ayodhyaలో రామమందిరం పూర్తి అయ్యేది

 

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జీవన్‌ రెడ్డి

హైదరాబాద్‌ మే 18 (ఇయ్యాల తెలంగాణ) :  కాంగ్రెస్‌ పార్టీ మతసామరస్యానికి కట్టుబడి ఉందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జీవన్‌ రెడ్డి తెలిపారు. శనివారం జీవన్‌ రెడ్డి విూడియాతో మాట్లాడారు. దివంగత మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ బతికి ఉంటే ఎప్పుడో అయోధ్యలో రామమందిరం పూర్తి అయ్యేదని, కోర్టు తీర్పు ప్రకారమే రామమందిరం నిర్మించామన్నారు. లోక్‌ సభ ఎన్నికలలో కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వస్తుందని జోస్యం చెప్పారు. కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఏర్పడిన ఇండియా కూటమి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మోడీ మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని దుయ్యబట్టారు. బిజెపి తీరుతోనే రామమందిర నిర్మాణం ఆలస్యమైందన్నారు. బుల్డోజర్‌ కల్చర్‌ తెచ్చింది బిజెపి ప్రభుత్వం అని విరుచుకపడ్డారు.  జగిత్యాల ప్రజల తీర్పును గౌరవిస్తానని జీవన్‌ రెడ్డి స్పష్టం చేశారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....