రానున్న రోజుల్లో ఎండలు మండిపోతాయి ! Weather Alert

 హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ

హైదరాబాద్‌ మార్చి 1 (ఇయ్యాల తెలంగాణ) : ఈ ఏడాది ఫిబ్రవరిలోనే భానుడు తన ప్రతాపం చూపించడం ప్రారంభించాడు. అయితే రాష్ట్రంలో రానున్న రోజుల్లో ఎండలు మండిపోతాయి అంటూ.. హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో ఎండలు తీవ్రంగా ఉంటాయని, ఇక ఏప్రిల్‌, మేలలో 44 నుంచి 46 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని అంచనా వేసింది.1901 నుంచి 2025 వరకు సరాసరి సగటు తీసుకుంటే.. ఈ ఏడాది ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లు తెలిపింది. దక్షిణ, మధ్య తెలంగాణలతో పాటు.. హైదరాబాద్‌ నగర పరిసర ప్రాంతాల్లో భానుడి భగభగలు తీవ్రంగా నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి. దక్షిణ, ఉత్తర తెలంగాణలో రాత్రిపూట ఉష్టోగ్రతలు సైతం సాధారణం కంటే రెండు డిగ్రీలు పెరిగే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....