వరద పీడిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన

 
భద్రాద్రి ఆగష్టు 3,(ఇయ్యాల తెలంగాణ ):భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో కేంద్ర బృందం ఏడుగురు సభ్యులతో గోదావరి వరద ప్రాంతాలను  పరిశీలించింది. బూర్గంపాడు మండల కేంద్రం లోని పులితేరు వాగు ఏరియాలో ఉన్న పంట పొలాలు, కొల్లు చెరువు ఏరియాలో ఉన్న పంట పొలాలను బృందం పరిశీలించింది. బూర్గంపాడు మండల పరిధిలో సుమారు 500 ఎకరాల వరి, ప్రత్తి,మొక్కజొన్న, కూరగాయల పంటలు వరదకు నష్టపోయాయి. కేంద్ర బృందానికి ఈ ప్రాంతంలో జరిగిన పంట నష్టాన్ని జిల్లా కలెక్టర్‌ ప్రియాంక ఆల తెలియజేశారు. పలువురు రైతులు కేంద్ర బృందానికి  పంట నష్టం వివరాలు తెలియజేశారు. రైతులను పంట నష్టం వివరాలు అడిగి తెలుసుకుని వివరాలు కేంద్ర బృందం సేకరించింది. …

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....