శ్రీచైతన్య School లో విద్యార్దుల ఘర్షణ

శ్రీచైతన్య స్కూల్లో విద్యార్దుల ఘర్షణ – ముగ్గురు పిల్లలకు తీవ్ర గాయాలు

మేడ్చల్‌, మార్చి 02 (ఇయ్యాల తెలంగాణ) : పేట్‌ బాషీరాబాద్‌ పియస్‌ పరిధిలోని కొంపల్లిలో గల శ్రీచైతన్య (కె 4) స్కూల్‌ లో ఘర్షణ జరిగింది. 9వ తరగతి,10వ తరగతి విద్యార్థుల మధ్య గొడవ తలెత్తింది.  10వ తరగతికి చెందిన ఏడుగురు విద్యార్థులు రాడ్లతో దాడికిపాల్పడ్డారు. ఘర్షణలో ముగ్గురు విద్యార్థుల తలలకు బలమైన గాయాలు అయ్యాయి. తలకు కుట్లు వేసి హస్టల్‌ కి హస్పిటల్‌ సిబ్బంది పంపివేసారు. తల్లిదండ్రుల పిర్యాదు ఇచ్చినా పోలీసులు  కేసునమోదు చేయలేదు. సున్నితమైన అంశం పిల్లల భవిష్యత్‌ కు ఇబ్బంది కలుగుతుందని,స్కూల్‌ లో మాట్లాడుకోవాలని పంపినట్టు బాధిత విద్యార్థుల తల్లిదండ్రుల ఆరోపణ..

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....