శ్రీశైలం అక్టోబర్ 12 (ఇయ్యాల తెలంగాణ ):అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వాముల వారి ఉభయ దేవాలయాలలో హుండీల లెక్కింపు ద్వారా దేవస్థానానికి రూ.3,17,50,290/` నగదు రాబడిగా లభించింది. కాగా ఆలయ హుండీల ఆదాయాన్ని భక్తులు గత 28 రోజులలో 14 నుండి 11 వరకు సమర్పించడం జరిగింది. అలాగే ఈ హుండీలో 187 గ్రాముల 300 మిల్లీ గ్రాముల బంగారు, 6 కేజీల 340 గ్రాముల వెండి లభించాయి. అదేవిధంగా 243 యుఎస్ఎస్ఐ డాలర్లు. 450 ` ఆస్ట్రేలియా డాలర్లు, 40 కెనడా డాలర్లు. 15 ` యూఏఈ దిర్హమ్స్, 6` సింగపూర్ డాలర్లు, 5` యూరోస్ మొదలైన విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీల లెక్కింపు లభించాయి. పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపును చేపట్టడం జరిగింది. ఈ హుండీల లెక్కింపులో కార్యనిర్వహణాధికారి పెద్దిరాజు, అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది మరియు శివసేవకులు పాల్గొన్నారు
- Homepage
- iyyala bhakthi
- శ్రీశైల మల్లన్న ఉభయ దేవాలయాల హుండీల లెక్కింపు
శ్రీశైల మల్లన్న ఉభయ దేవాలయాల హుండీల లెక్కింపు
Leave a Comment